కృష్ణా జిల్లా పామర్రు మండలం అడ్డాడలోని ఓ ఆలయంలో చోరీ జరిగింది. స్థానికంగా ఉన్న రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో దొంగతనం జరిగింది. తాళాలు పగలగొట్టి ఆలయంలోకి ప్రవేశించిన దొంగలు.. ఆలయంలో అందినకాడికి దోచుకునిపోయారు. అయితే ఉదయాన్నే పూజారి గుడి తలుపులు తీసి చూడటంతో.. ఈ చోరీ వ్యవహారం తెలిసింది. హుండీ తాళాలు, గర్భగుడి తాళాలు పగలుగొట్టి ఉండటం చూసిన ఆలయ పూజారి చూసి షాక్ అయ్యారు. వెంటనే పోలీసులకు దొంగతనం జరిగిన విషయాన్ని చేరవేశారు. అయితే ఆలయంలో ఏయే వస్తువులు చోరీ అయ్యాయనే సంగతిపై ఇంకా క్లారిటీ లేదు.
మరోవైపు పెనుగంచిప్రోలు తిరుపతమ్మ దర్శనానికి వచ్చిన భక్తులకు ప్రమాదం జరిగింది. వాహనం బోల్తా పడటంతో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. కృష్ణా జిల్లా మోపిదేవి మండలం వెంకటాపురానికి చెందిన భక్తులు బుధవారం తిరుపతమ్మ అమ్మవారి దర్శనం కోసం టాటా ఏస్ వాహనంలో వచ్చారు. దర్శనం అనంతరం స్థానికంగా ఉన్న గార్డెన్లో భోజనాలకు వెళ్తున్నారు.
ఈ సమయంలో వీరి వాహనం ప్రమాదానికి గురైంది. టాటా ఏస్ వాహనం మునేరు వంతెన దాటిన తర్వాత అదుపు తప్పింది. దీంతో టాటా ఏస్ వాహనంలో ఉన్న 12 మంది సిమెంట్ రోడ్డుపై పడిపోయారు. దీంతో 12 మందికి గాయాలయ్యాయి. అయితే ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. తీవ్ర గాయాలైన వారిని మెరుగైన చికిత్స కోసం విజయవాడ తరలించారు. ఈ ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa