భారతదేశంలో ఉంటూ పాకిస్థాన్ ఐఎస్ఐ తరఫున గూఢచర్యం చేస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. గత 12 సంవత్సరాలుగా అతడు సైన్యానికి సంబందించిన సున్నితమైన సమాచారాన్ని పాకిస్థాన్కు చేరవేస్తున్నానరే ఆరోపణలపై అతడిని అదుపులోకి తీసుకున్నారు. 2013లో పాక్ వెళ్లిన అతడు శిక్షణ కూడా పొందినట్లు గుర్తించారు. ముఖ్యంగా రాజస్థాన్ జైసల్మేర్ జిల్లాలో ఉంటూ అంతర్జాతీయ సరిహద్దు ఫొటోలు, సైన్యం కదలికలను ఐఎస్ఐ కు చేరవేశాడని ఇంటెలిజెన్స్ డీజీపీ సంజయ్ అగర్వాల్ వెల్లడించారు. ఆ పూర్తి వివరాలు మీకోసం.
రాజస్థాన్ జైసల్మేర్ జిల్లాలోని అంతర్జాతీయ సరహద్దుకు సమీపంలో ఉన్న మోహన్ గఢ్ ప్రాంతంలో ఉన్న పఠాన్ ఖాన్.. పాకిస్థాన్కు గూఢచర్యం చేస్తున్నట్లు పోలీసులు తెలుసుకున్నారు. ముఖ్యంగా పఠాన్ ఖాన్ అనుమానాస్పదంగా కనిపిస్తూ.. సరిహద్దు సమీపంలో తిరగడం గుర్తించారు. అతడేదో తప్పుడు పని చేస్తున్నాడని భావించి అధికారులకు సమాచారం ఇవ్వడంతో అతడిపై నిఘా పెట్టారు. ఈక్రమంలోనే అతడు సరిహద్దు వద్ద ఫొటోలు తీస్తుండగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
ఎందుకిలా చేస్తున్నావంటూ ప్రశ్నించగా.. 2013లో పాకిస్థాన్కు కూడా వెళ్లినట్లు విచారణలో తెలుసుకున్నారు. అక్కడే అతడు శిక్షణ కూడా పొంది వచ్చాడని.. వచ్చిన తర్వాత నుంచి పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ అధికారులతో అతడు టచ్లో ఉన్నాడని గుర్తించారు. మతపరమైన యాత్ర కోసం పాకిస్థాన్కు వెళ్లినప్పుడు సైన్యానికి సంబంధించిన సమాచారంతో పాటు జైసల్మేర్ సరిహద్దు ఫొటోలను ఆ దేశ అధికారులకు చేరవేశాడని తెలుసుకుని కేసు పెట్టారు.
వచ్చిన తర్వాత కూడా ఇతడు బీఎస్ఎఫ్ దళాల ఫొటోలు, వీడియోలు, వారు ఏమే చేస్తున్నారు వంటి వాటిని ఎప్పటికప్పుడు ఫోన్లో రికార్డు చేస్తున్నట్లు గుర్తించారు. అయితే ఇతడి నెట్ వర్క్ మరెంత లోతుగా ఉందో కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. దశాబ్దానికి పైగా జాతీయ భద్రతా ఉల్లంఘనలు ఏ విధంగా జరిగాయని, ఇతడికి మరికొంత మంది కూడా సహాయం చేసి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఆ లింకులన్నీ బయటపడాలంటే మరికొన్ని రోజులు అతడిని విచారించారని.. ప్రస్తుతం అతడు తమ కస్టడీలోనే ఉన్నట్లు స్పష్టం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa