చంద్రగిరి మండలం కాశింపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కర్ణాటక రాష్ట్రం లగేరి నుంచి తిరుమలకు వెళ్తున్న ఓ కారు ప్రమాదానికి గురైంది. చంద్రగిరి మండలం కాశిపెంట వద్దకు రాగానే కారు జాతీయ రహదారిపై అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో కారులోని ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. మృతుల్లో ఆరేళ్ల చిన్నారి కూడా ఉన్నారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa