విశాఖపట్నంలో విషాద ఘటన చోటుచేసుకుంది. విశాఖపట్నంలోని మురళీ నగర్లో ఈ ఘటన చోటుచేసుకుంది. రెండో అంతస్తులో ఉంటున్న పద్మావతి అనే మహిళ.. కింద ఉన్న పాల ప్యాకెట్ను కేబుల్ వైర్తో కట్టిన బుట్ట ద్వారా పైకి తీసుకునే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో కరెంట్ తీగలు తగలటంతో కరెంట్ షాక్ కొట్టి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై మృతురాలి భర్త ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అటు మధురవాడలోనూ కరెంట్ షాక్ కొట్టి ఓ వ్యక్తి చనిపోయాడు.
జనాభా పెరుగుతోంది. జనాభా అవసరాలకు అనుగుణంగా భూమి పెరగలేదు. దీంతో బహుళ అంతస్థుల భవనాలు, అపార్టుమెంట్లు పెరుగుతున్నాయి. మనలో చాలా మంది అపార్టుమెంట్లల్లోనూ, రెండు మూడు అంతస్తులు ఉన్న ఇళ్లల్లోనూ నివసిస్తుంటారు. లిఫ్ట్ ఉంటే సరే సరి.. లేకపోతే ఏది కావాలన్నా పదే పదే కిందకీ పైకి ఎక్కి దిగాల్సి ఉంటుంది. ఈ క్రమంలో పాలప్యాకెట్లు, న్యూస్ పేపర్ కోసం మనలో చాలా మంది ఉండే ఫ్లోర్ నుంచి కిందకు.. తాడు కట్టి, బుట్టను కిందకు వేలాడేస్తూ ఉంటాం. పాలప్యాకెట్లు వేసేవాడు, పేపర్ వాడు అందులో పడేస్తే.. తర్వాత తీరిగ్గా పైకి తీసుకుంటూ ఉంటాం. అయితే అలాంటి పని ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగిని ప్రాణం తీసింది. విశాఖపట్నం జిల్లాలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.
విశాఖపట్నంలోని మురళీ నగర్లో జీవీ పద్మావతి అనే 29 ఏళ్ల మహిళ నివసిస్తున్నారు. పద్మావతి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుంటారు. రోజూలాగే ఉదయం తాము ఉంటున్న భవనంలోని రెండో అంతస్తు నుంచి పాలప్యాకెట్ తీసుకునే ప్రయత్నం చేశారు, అయితే ఇక్కడే ఆమె తప్పు చేశారు. కేబుల్ వైర్ ద్వారా కింద ఉన్న పాల ప్యాకెట్ను తీసుకునే క్రమంలో అక్కడే ఉన్న కరెంట్ తీగలకు పద్మావతి తగిలారు. దీంతో కరెంట్ షాక్ తగిలి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పద్మావతి భర్త అజయ్ వెంటనే పోలీసులకు ఈ సమాచారం చేరవేశారు. దీంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. అజయ్ ఫిర్యాదు మేరకు కంచరపాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa