ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆలయంలో అగ్నిప్రమాదం,,,పోలీసులు ఆరా

Crime |  Suryaa Desk  | Published : Fri, May 02, 2025, 11:24 PM

తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలోని ఓ ఆలయంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మల్లయ్యపల్లిలోని ఆలయంలోకి కొంతమంది దుండగులు నిప్పు విసిరారు. దీంతో ఆలయంలోని దేవుళ్ల చిత్రపటాలు కాలిపోయాయి. ఉదయాన్నే ఈ సంగతిని గమనించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ ఘటనపై ఆరా తీస్తున్నారు. మరోవైపు ఇది కావాలని చేశారా లేదా ప్రమాదవశాత్తూ మంటలు చెలరేగాయా అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.


ప్రస్తుత సమాజంలో రోజురోజుకూ ఆకతాయిల పనులు శ్రుతిమించుతున్నాయి. అలాంటి ఘటనే తిరుపతి జిల్లాలో చోటుచేసుకుంది. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం మల్లయ్యపల్లిలో కొంతమంది దుండగులు గుడిలోకి నిప్పు విసిరినట్లు తెలిసింది.. గురువారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న శ్రీకృష్ణ దేవాలయం గర్భగుడిలోకి దుండగులు నిప్పు విసిరారని స్థానికులు చెప్తున్నారు. దీంతో ఆలయంలోని దేవుళ్ల చిత్రపటాలకు నిప్పు అంటుకుంది. వేంకటేశ్వర, అయ్యప్ప, వినాయక స్వామిల చిత్రపటాలు మంటల్లో కాలిపోయాయి. ఉదయాన్నే ఈ విషయాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. ఇది ఎవరైనా కావాలని చేశారా.. లేదా ఆకతాయిల పనా, లేదా ప్రమాదమా అనే కోణంలోనూ దర్యాప్తు జరుపుతున్నారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa