ట్రెండింగ్
Epaper    English    தமிழ்

2 నెలల్లో రెండోసారి షాక్.. మే 1 నుంచే అమలు

business |  Suryaa Desk  | Published : Fri, May 02, 2025, 11:50 PM

దేశీయ అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకుల్లో ఒకటైన పంజాబ్ నేషనల్ బ్యాంక్ తమ కస్టమర్లకు మరోసారి షాకిచ్చింది. రూ.3 కోట్ల లోపు ఉండే రిటైల్ డిపాజిట్ల వడ్డీ రేట్లను సవరించింది. ఏప్రిల్ 2025లోనే ఫిక్స్‌డ్ డిపాజిట్ల వడ్డీ రేట్ల కోత పెట్టిన సంగతి తెలిసిందే. కేవలం వారాల వ్యవధిలోనే మరోసారి డిపాజిట్ల వడ్డీ రేట్లను తగ్గించడం గమనార్హం. ఈసారి ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్ల మేర కోత పెట్టింది. సవరించిన కొత్త వడ్డీ రేట్లను మే 1, 2025 నుంచే అమలులోకి తీసుకొచ్చనట్లు బ్యాంక్ తెలిపింది.


సవరణ తర్వాత పంజాబ్ నేషనల్ బ్యాంక్ తమ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 3.50 శాతం నుంచి 7.10 శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తోంది. ఇవి 7 రోజుల నుంచి 10 ఏళ్ల టెన్యూర్ డిపాజిట్లపై జనరల్ కస్టమర్లకు వర్తిస్తాయి. గరిష్ఠ వడ్డీ రేటును 390 రోజుల ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకం ద్వారా అందిస్తోంది. మరోవైపు.. రూ.3 కోట్ల లోపు డిపాజిట్లకు 180 రోజుల నుంచి 270 రోజుల మెచ్యూరిటీ టెన్యూర్లపై వడ్డీ రేటను 6.25 శాతం నుంచి 6 శాతానికి తగ్గించింది. అలాగే 271 రోజుల నుంచి 299 రోజుల డిపాజిట్లపై వడ్డీ రేటును 6.50 శాతం నుంచి 6.25 శాతానికి కుదించింది.


అలాగే 303 రోజుల టెన్యూర్ డిపాజిట్లపై వడ్డీ రేటును 6.40 శాతం నుంచి 6.15 శాతానికి కోత పెట్టింది. అలాగే 304 రోజుల నుంచి ఏడాదిలోపు టెన్యూర్ ఉండే డిపాజిట్లకు వడ్డీ రేటును 6.50 శాతం నుంచి 6.25 శాతానికి కుదించింది. ఇక ఏడాది టెన్యూర్ డిపాజిట్లపై ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను 6.80 శాతం నుంచి 6.70 శాతానికి కుదించింది. మరోవైపు.. 60 ఏళ్ల వయసు పైబడిన సీనియర్ సిటిజన్లకు 50 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేటు అదనంగా అందిస్తోంది. సీనియర్ సిటిజన్లకు ప్రస్తుతం 4 శాతం నుంచి 7.60 శాతం మధ్య వడ్డీ కల్పిస్తోంది. అలాగే 80 ఏళ్ల వయసు గల సూపర్ సీనియర్ సిటిజన్లకు వడ్డీ రేటును 4.30 శాతం నుంచి 7.90 మధ్య ఆఫర్ చేస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa