ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో మూడు రోజులు భిన్న వాతావరణం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, May 03, 2025, 08:55 PM

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే మూడు రోజులు (మంగళవారం వరకు) విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొంటాయని ఏపీ వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాలతో సహా కాకినాడ, కోనసీమ, ఏలూరు, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, తిరుపతి, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. 
ఈ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 41.5 నుంచి 43 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని శాఖ సూచించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa