ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉగ్రదాడి.. భారత్‌కు మా పూర్తి మద్దతు: పుతిన్

international |  Suryaa Desk  | Published : Mon, May 05, 2025, 03:29 PM

పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు విడిచిన ఘటనపై.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పందించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఫోన్‌లో మాట్లాడిన ఆయన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదంపై పోరాటంలో భారతదేశానికి తమ పూర్తి మద్దతు ఉంటుందని పుతిన్ హామీ ఇచ్చారు.  ఈ విషయాన్ని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ తెలిపారు. ‘రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఫోన్ చేసి పహల్గాం జరిగిన ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండించారు. దాడిలో ప్రాణాలు కోల్పోయిన మృతులకు తీవ్ర సంతాపం తెలిపారు. ఉగ్రవాదంపై పోరాటంలో భారతదేశానికి ఆయన పూర్తి మద్దతు ప్రకటించారు’ అని జైస్వాల్‌ పేర్కొన్నారు. ఈ దారుణమైన ఘటనకు పాల్పడిన వారిని, వారి మద్దతుదారులను చట్టం ప్రకారం శిక్షించాలని అన్నారని, భారతదేశం-రష్యా విశేష వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పెంచుకుంటామని చెప్పారన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa