మహిళా ప్రభుత్వ ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వం శుభవార్త అందించింది. గత కొన్నిరోజులుగా జనాభాను పెంచాలని ప్రజలకు సూచిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. అలాంటి వాటిని ప్రోత్సహించే పనిలో పడ్డారు. ఇందులో భాగంగానే మహిళా ఉద్యోగులకు మాతృత్వ సెలవులను పెంచుతూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు ఇస్తున్న మెటర్నిటీ లీవులకు అదనంగా మరో రెండు నెలలు సెలవులు ఇవ్వనున్నట్లు ఏపీ సర్కార్ ఉత్తర్వులు వెలువరించింది. ఇప్పటివరకు ఏపీలో మహిళా ఉద్యోగులకు ప్రభుత్వం 120 రోజుల పాటు మెటర్నిటీ సెలవులు ఇస్తుండగా.. వాటిని 180 రోజులకు పెంచుతూ చంద్రబాబు ప్రభుత్వం జీవో విడుదల చేసింది.
మరోవైపు.. ఈ మెటర్నిటీ లీవులకు సంబంధించి మరో కీలక నిర్ణయాన్ని కూడా చంద్రబాబు ప్రభుత్వం వెలువరించింది. ఇప్పటివరకు ప్రభుత్వ ఉద్యోగులు ఇద్దరు పిల్లలు కనడానికి మాత్రమే ప్రసూతి సెలవులు ఇచ్చేవారు. మూడో సంతానం పుట్టినా.. మహిళా ఉద్యోగులకు ఈ మెటర్నిటీ లీవులు ఇచ్చేవారు కాదు. కానీ తాజాగా కూటమి ప్రభుత్వం ఆ నిబంధనను ఎత్తేసింది. ఇక నుంచి ఎంత మంది పిల్లలకు జన్మనిచ్చినా.. వారికి అన్ని సార్లు ప్రసూతి సెలవులు ఇవ్వనున్నట్లు తెలిపింది. గతంలో ఉన్న నిబంధనలను తొలగించి.. ఈ కొత్త ఆదేశాలు వెంటనే అమల్లోకి వస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఇదిలా ఉండగా.. తాము అధికారంలోకి వస్తే ప్రభుత్వ ఉద్యోగులకు మెటర్నిటీ సెలవులను పెంచుతామని టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి.. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రకటించింది. అంతేకాకుండా అధికారంలోకి వస్తే మహిళా ఉద్యోగుల సమస్యలపై దృష్టి సారిస్తామని హామీ ఇచ్చింది. అయితే అంతకుముందు చాలా కాలం నుంచి ఈ డిమాండ్ ఉండగా.. తాజాగా ప్రభుత్వం దానికి ఆమోద ముద్ర వేస్తూ.. ప్రసూతి సెలవులను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. మహిళా ఉద్యోగులు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చేసుకునేందుకు ఈ మెటర్నిటీ లీవులను పెంచే నిర్ణయం తీసుకున్నట్టు ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల మహిళా ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa