ప్రస్తుతం వేసవి కాలం నడుస్తుండటంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. దీంతో తిరుమలకు వెళ్లాలనుకునే భక్తులు.. ఎండ వేడిమి ఉన్నప్పటికీ శ్రీవారి దర్శనానికి పోటెత్తుతున్నారు. ఫలితంగా భక్తుల రద్దీతో తిరుమల కొండ కిటకిటలాడుతోంది. అయితే ఎండాకాలంలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తిరుమల తిరుపతి దేవస్థానం - టీటీడీ కీలక చర్యలు చేపట్టింది. శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవారి సర్వదర్శనం కోసం వచ్చే భక్తులకు స్వామివారి దర్శనం మరింత సులువుగా కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. కంపార్ట్మెంట్లలో వేచి ఉండే అవసరం లేకుండానే.. భక్తులకు నేరుగా శ్రీవారి దర్శనం కల్పించేలా చర్యలు చేపట్టింది. బ్రేక్ దర్శనాలు రద్దు చేయడంతో సామాన్య భక్తులకు మరింత వేగంగా స్వామి వారి దర్శనం జరుగుతోంది.
సాధారణంగా నిత్యం తిరుమల తిరుపతి దేవస్థానానికి 60 నుంచి 70 వేల మంది భక్తులు వచ్చి శ్రీవారిని దర్శించుకుంటారు. ఇక ప్రత్యేక రోజులు, సెలవు రోజుల్లో భక్తుల రద్దీతో తిరుమల కొండ కిక్కిరిసిపోతుంది. మరోవైపు.. ప్రస్తుత వేసవి సెలవుల్లో అయితే తిరుమల గిరులు భక్తులతో కిటకిటలాడుతుంటాయి. దీంతో సర్వదర్శనం భక్తులకు సులభతరంగా స్వామివారి దర్శనం కల్పించేలా టీటీడీ ఏర్పాట్లు చేసింది. స్వామివారి దర్శనం కోసం వచ్చే భక్తులు.. శ్రీవారి వైకుంఠం కాంప్లెక్స్లోని కంపార్టుమెంట్లలో వేచి ఉండే అవసరం లేకుండానే.. నేరుగా టీటీడీ అధికారులు దర్శనాలు కల్పిస్తున్నారు. బ్రేక్ దర్శనాలు రద్దు చేయడంతో.. సర్వదర్శనం లైన్లలో వచ్చే భక్తులకు వేగంగా దర్శనాలు జరుగుతున్నాయి.
ఈ క్రమంలోనే భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో వేచి ఉండాల్సిన అవసరం లేకుండా నేరుగా శ్రీవారి దర్శనానికి భక్తులను టీటీడీ అధికారులు పంపించేస్తున్నారు. ఇక ఆదివారం రోజున శ్రీవారిని 83,380 మంది భక్తులు దర్శించుకున్నారు. మరోవైపు.. 27,936 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ఆదివారం రోజున శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.35 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు ప్రకటించారు. మరోవైపు.. మంగళవారం నుంచి 3 రోజులపాటు శ్రీవారి వార్షిక పద్మావతి పరిణయోత్సవాలు నిర్వహించేందుకు టీటీడీ అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసింది. ఈ నేపథ్యంలోనే ఈ 3 రోజులు పాటు శ్రీవారి ఆలయంలో ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలను రద్దు చేస్తున్నట్టు టీటీడీ అధికారులు ప్రకటించిన విషయం తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa