తమిళనాడుకు చెందిన ఓ ఎంపీ ఆదివారం రోజు రాత్రి ఓ గ్రామంలో రాజకీయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అయితే ప్రజలు అంతా కింద కూర్చుని ఉండగా.. ఎంపీ స్టేజీపైకి ఎక్కి ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నారు. ఈ సమంయలోనే స్టేజీ లైట్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. అయితే ముందుగానే విషయం గుర్తించిన ఎంపీ కాస్త పక్కకు జరగ్గా లైటు మైకుపై పడిపోయింది. ఇలా క్షణాల్లోనే పెను ప్రమాదం నుంచి ఎంపీ తప్పించుకోగా.. అక్కడున్న వారంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆ పూర్తి వివరాలు మీకోసం.
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పుట్టిన రోజు, గవర్నర్ అంశంలో పార్టీ చట్టపరమైన విజయాన్ని జరుపుకోవడానికి.. డీఎంకే పార్టీకి చెందిన ఎంపీ ఏ రాజా ఓ కార్యక్రమం నిర్వహించాలనుకున్నారు. అనుకున్నట్లుగానే మైలదుత్తురైలో ఆదివారం రోజు సాయంత్రం ఓ రాజకీయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఈ కార్యక్రమానికి పార్టీ నేతలు సహా పెద్ద ఎత్తున ప్రజలు వచ్చారు. ఈక్రమంలోనే ఎంపీ రాజా ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. అప్పుడే పెద్ద ఎత్తున గాలులు వచ్చాయి. ఫలితంగా స్టీల్ రాడ్పై అమర్చిన భారీ స్టేజీ లైట్ బోల్తా పడడంతో అంతా షాక్ అయ్యారు.
ముఖ్యంగా ఆ భారీ స్టేజ్ లైట్ ఒక్కసారిగా ఎంపీ రాజాపైకి దూసుకు రాగా.. ముందుగానే విషయం గుర్తించిన ఆయన ఒక్కసారిగా పక్కకు జరిగారు. అలా ఆయన జరిగిన కొన్ని సెకన్లలోనే లైట్ మైక్పై పడింది. దీంతో మైక్ విరగడంతో పాటు.. అక్కడి స్టేజీ కూాడా అటూ ఇటూ కదిలింది. ఇలా త్రుటిలోనే ఎంపీ రాజా ఈ ప్రమాదం నుంచి బయట పడగా.. పార్టీ శ్రేణులు, ప్రజలంతా ఊపిరి పీల్చున్నారు. కానీ పెద్ద ఎత్తున గాలులు, వర్షం కూడా కురిసే అవకాశం ఉండడం, అందులోనూ స్టేజీ కూలే అవకాశం ఉండడందో.. హుటాహుటిన అంతా స్టేజీ పైనుంచి కిందకు దిగారు. ఇంకాసేపు అక్కడే ఉంటే మరిన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉండడంతో.. సమావేశాన్ని ఆపేసి ఇంటికెళ్లాలని నిర్ణయించుకున్నారు.
ఇదే విషయాన్ని అక్కడి ప్రజలకు చెప్పి ఇళ్లకు వెళ్లిపోవాలని సూచించారు. ఆపై నేతలు సహా ప్రజలంతా కాసేపట్లోనే అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత అక్కడ బలమైన గాలులతో పెద్ద ఎత్తున వర్షం కురవగా.. స్టేజీ సహా అక్కడ చేసిన ఏర్పాటల్నీ చెల్లాచెదురు అయ్యాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతుండగా.. అంతా షాక్ అవుతున్నారు. అదృష్టం ఎక్కువై ఎంపీ రాజా ఇలా త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు గానీ.. లేకపోతే ఏమయ్యుండేదో అంటూ నెటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా ఓ వ్యక్తి అయితే.. అబ్బా జర్రుంటే సచ్చిపోదును.. ఇది ఎంపీ రాజా ఫీలింగ్ అంటా కామెంట్ చేశాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa