ట్రెండింగ్
Epaper    English    தமிழ்

IPS ఆఫీసర్‌గా నటించి దోపిడీ.. ఖమ్మంలో రూ.26.5 లక్షలు కొల్లగొట్టిన సైబర్ నేరగాడు

Crime |  Suryaa Desk  | Published : Tue, May 06, 2025, 02:05 PM

సైబర్ నేరగాళ్లు కొత్త పుంతలు తొక్కుతూ మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఖమ్మంలో ఓ మహిళను టార్గెట్ చేసిన సైబర్ నేరగాడు, వీడియో కాల్ ద్వారా బెదిరించి రూ.26 లక్షల 50 వేలు కొట్టేశాడు. తనను IPS ఆఫీసర్‌గా పరిచయం చేసుకున్న వ్యక్తి, మహిళ బ్యాంక్ ఖాతాలో అక్రమ లావాదేవీలు జరిగాయని, కేసు నమోదైందని బెదిరించాడు. అరెస్ట్‌ను తప్పించుకోవాలంటే రూ.26 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశాడు.
భయపడిన మహిళ బంగారం తాకట్టు పెట్టి, నగదు చెల్లించింది. అనుమానం వచ్చిన ఆమె బంధువుల సాయంతో మోసాన్ని గుర్తించి, పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సైబర్ నేరగాళ్లు ఇలాంటి 'డిజిటల్ అరెస్ట్' స్కామ్‌లతో ప్రజలను భయపెడుతున్నారని, తెలియని కాల్స్‌పై అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa