యుద్ధం వంటి అత్యవసర పరిస్థితులపైనా, పెద్ద ఎత్తున గందరగోళ పరిస్థితులపై దేశ పౌరులు ఎలా స్పందించాలి అనే దిశగా అవగాహన పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. మే 7న బుధవారం నాడు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో మాక్ డ్రిల్స్ నిర్వహించాల్సిందిగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది.
ఈ డ్రిల్స్ ద్వారా ప్రజలు ఇటువంటి అత్యవసర సమయాల్లో ఏ విధంగా స్పందించాలి, ప్రభుత్వ యంత్రాంగం ఎలా సమన్వయంతో పనిచేయాలి అనే అంశాల్లో సాధన చేయనున్నారు. ఆయా ప్రాంతాల్లోని పోలీస్ శాఖ, అగ్నిమాపక సిబ్బంది, వైద్య సేవల బృందాలు, సివిల్ డిఫెన్స్ సిబ్బంది, మరియు ఇతర అత్యవసర సేవల విభాగాలు ఇందులో భాగం కానున్నాయి.
కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రకారం, ఈ మాక్ డ్రిల్స్ అనేవి జాతీయ స్థాయిలో సమగ్ర రక్షణ మెకానిజం నిర్మాణంలో భాగంగా తీసుకొన్న చర్యలలో ఒకటి. పౌరుల జాగ్రత్తలు, అప్రమత్తత మరియు సమయానికి స్పందించే సామర్థ్యాన్ని పెంపొందించడమే దీని ముఖ్య ఉద్దేశ్యం.
ప్రత్యేకించి సరిహద్దు రాష్ట్రాలు, అధిక జనాభా కలిగిన నగరాలు, మరియు ప్రధాన మౌలిక వసతులు ఉన్న ప్రాంతాల్లో ఈ డ్రిల్స్ మరింత ఘనంగా నిర్వహించనున్నట్లు సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa