ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మన దేశం-మన నీళ్లు-మన హక్కు..ప్రధాని మోదీ

national |  Suryaa Desk  | Published : Tue, May 06, 2025, 10:21 PM

భారత్‌లోని నీళ్లపై భారతదేశానికే హక్కు ఉంటుందని.. దేశంలో ప్రవహించే నీటిని దేశ అవసరాలకే వాడుకుంటామని ప్రధాని నరేంద్ర మోదీ తేల్చి చెప్పారు. భారత్ పాక్ ఉద్రిక్తతల వేళ.. సింధూ నది నీటిని పాక్‌లోకి వెళ్లకుండా అడ్డుకున్న వ్యవహారంపై ప్రధాని మోదీ తాజాగా తొలిసారి మీడియాతో మాట్లాడారు. గతంలో భారత్‌లో ప్రవహించిన నీరు.. ఇతర దేశాలకు వెళ్లేవని.. కానీ ఇక నుంచి మన 


పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్‌కు భారత్ షాక్‌ల మీద షాక్‌లు ఇస్తోంది. మొట్టమొదటగా.. సింధూ నదీ జలాల ఒప్పందాన్ని తక్షణమే రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం.. పాకిస్తాన్‌కు వెళ్లే సింధూ నదీ జలాలను అడ్డుకుంది. దీంతో ఇప్పటికే సాగు, తాగు నీరు లేక అల్లాడుతున్న పాక్‌ పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్‌కు సింధూ నదీ జలాలను వెళ్లకుండా అడ్డుకుని.. ఆ దేశానికి చుక్కలు చూపించాలని భారత్ డిసైడ్ అయింది. ఈ క్రమంలోనే ఇటీవల ఉద్రిక్త పరిస్థితుల వేళ సింధూ నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేయడంపై తొలిసారి ప్రధాని మోదీ స్పందించారు.


పాకిస్తాన్‌కు సింధు నదీ జలాల నిలిపివేతపై మంగళవారం ఓ న్యూస్ ఛానల్ ప్రతినిధితో మాట్లాడిన ప్రధాని మోదీ.. గతంలో భారత జలాలు బయటి దేశాలకు వెళ్లేవని.. ఇప్పుడు మన దేశంలో ప్రవహించే నీరంతా మన దేశంలోనే ఉంటుందని స్పష్టం చేశారు. మన దేశంలో ప్రహించే నీటిని.. మన దేశ అవసరాలకే వాడుకుందామని పాకిస్తాన్‌ను ఉద్దేశించి పరోక్షంగా ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. మన దేశంలోని జలాలను దేశీయ అవసరాలకే వినియోగిస్తామని ఈ సందర్భంగా ప్రధాని మోదీ ప్రకటించారు. ఈ క్రమంలోనే "మన దేశం- మన నీళ్లు- మన హక్కు" అనే నినాదాన్ని వినిపించారు.


ఇక నుంచి మన జలాలు మన దేశ అభివృద్ధికి, ప్రయోజనాలకు మాత్రమే వినియోగించబడతాయని ప్రధాని మోదీ చెప్పారు. ఆ నీటిని మనమే నిల్వ చేసుకుంటామని తేల్చి చెప్పారు. 1961లో జరిగిన సింధూ నదీ జలాల ఒప్పందం ప్రకారం.. సింధూ నదికి సంబంధించి భారత్‌కు హక్కు ఉన్న నీటిని ఇప్పటివరకు కొంతవరకు మాత్రమే భారత్ ఉపయోగించుకుంటూ వస్తోంది. కానీ ఇప్పుడు దేశ ప్రయోజనాల దృష్ట్యా పూర్తి హక్కును వినియోగించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఏప్రిల్ 23వ తేదీన జరిగిన కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ (సీసీఎస్) సమావేశంలో ఈ సింధూ నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు.


దీనికి సంబంధించి.. విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ కీలక వ్యాఖ్యలు చేశారు. సింధు నదీ జలాల ఒప్పందం తక్షణమే నిలిపివేస్తున్నామని తేల్చి చెప్పారు. సీమాంతర ఉగ్రవాదానికి పాకిస్తాన్ మద్దతు ఇవ్వడం ఆపే వరకు ఈ నిషేధం అమలులో ఉంటుందని విక్రమ్ మిస్రీ వెల్లడించారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa