జమ్ము కశ్మీర్లో ఏప్రిల్ 22వ తేదీన ఉగ్రదాడి జరిగిన విషయం అదంరికీ తెలిసిందే. అయితే సైనిక దుస్తుల్లో వచ్చిన ముష్కరులు అమాయక పర్యటకులపై కాల్పులు జరిపి.. మొత్తం 26 మందిని చంపేశారు. ఈ ఘటనతో దేశం మొత్తం ఉలిక్కిపడగా.. ముష్కరులను పట్టుకునేందుకు భారత బలగాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఇదంతా చేసింది పాకిస్థాన్ ఉగ్రవాదులేనని తెలుసుకుని దాయాది దేశాన్ని దౌత్యపరంగా ఇబ్బంది పెడుతోంది. ఇలాంటి సమయంలోనే ఉగ్రదాడి జరిగిన ప్రాంతంలో ఓ వ్యక్తి కలకలం సృష్టించాడు. ముఖ్యంగా బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ధరించి మరీ సంఘటనా స్థలంలో తచ్చాడగా.. భద్రతా బలగాలు అతడిని అదుపులోకి తీసుకున్నాయి. ఆ పూర్తి వివరాలు మీకోసం.
జమ్ము కశ్మీర్లోని పహల్గాంలో ఏప్రిల్ 22వ తేదీన జరిగిన మారణహోమం గురించి అందరికీ తెలిసిందే. ఈ దాడి తర్వాత నుంచి భారత బలగాలు అప్రమత్తమయ్యాయి. ఓవైపు దాడికి పాల్పడ్డ ఉగ్రవాదులను పట్టుకునేందుకు వేట కొనసాగిస్తూనే.. మరోవైపు దేశంలో ఉన్న ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. జమ్ము కశ్మీర్లో ప్రతిరోజూ సెర్చ్ ఆపరేషన్లు జరుపుతూ.. ఏ ఒక్కరు అనుమానాస్పదంగా కనిపించినా వెంటనే అదుపులోకి తీసుకుంటున్నాయి. ఇప్పటికే ఇలా అనేక మంది పట్టుబడగా.. వారందిరనీ విచారిస్తూనే వస్తున్నాయి. ఎక్కడా ఎలాంటి చిన్న క్లూ దొరికినా.. ముష్కరులను మట్టుపెట్టాలని చూస్తున్నాయి.
మరోవైపు భారత ప్రభుత్వం పహల్గాం దాడికి పాల్పడింది పాకిస్థాన్కు చెందిన ఉగ్రవాదులేనని గుర్తించింది. ఈక్రమంలోనే ఆ దేశాన్ని దౌత్యపరంగా ఇబ్బందులకు గురి చేస్తోంది. ఇప్పటికే సింధూ నదీ జాలల ఒప్పందాన్ని రద్దు చేసింది. పాకిస్థాన్కు చెందిన పౌరులను తిరిగి వారి దేశాలకు పంపించింది. ఆ దేశం నుంచి దిగుమతులపై నిషేధం విధించింది. మన గగనతలంలోకి పాక్ విమానాలను కూడా రానీయకుండా చేసింది. ఇవి మాత్రమే కాకుండా ఎక్కడి నుంచి ఆ దేశానికి నిధులు అందకుండా చర్యలు చేపడుతుంది. ఇలా ప్రతీక్షణం ఆ దేశానికి చుక్కలు చూపిస్తూ.. ముష్కరుల కోసం వేట సాగిస్తోంది.
ఇలాంటి సమయంలోనే పహల్గాం ఉగ్రదాడి జరిగిన ప్రాంతంలో ఓ వ్యక్తి కలకలం సృష్టించాడు. ముఖ్యంగా బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ధరించి మరీ వచ్చి.. బైసరన్ లోయలో తచ్చాడుతూ కనిపించాడు. చాలా సేపు అక్కడక్కడే అతడు తిరుగుతూ కనిపించగా.. వెంటనే భద్రతా బలగాలు అతడిని అదుపులోకి తీసుకున్నాయి. అసలెవరు నీవు, ఇక్కడెందుకు ఉన్నావు, ఈ జాకెట్ ఎవరిచ్చారంటూ సిబ్బంది ప్రశ్నల వర్షం కురిపించగా.. అతడు పొంతన లేని సమధానాలు చెప్పాడు. దీంతో సిబ్బంది అతడిని స్థానిక పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం విచారణ సాగుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa