ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'ఆపరేషన్ సింధూర్‌'కు చంద్రబాబు మద్దతు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, May 07, 2025, 12:25 PM

పాకిస్థాన్‌లోని ఉగ్రస్థావరాలపై భారతదేశం మెరుపు దాడులు చేసింది. 'ఆపరేషన్ సింధూర్‌'  పేరుతో దాడులు చేసింది. పాకిస్థాన్, పీఓకేలోని 9 ఉగ్ర స్థావరాలపై భారత బలగాలు దాడులు చేశాయి. 9 పాక్ ఉగ్రస్థావరాలను భారత బలగాలు ధ్వంసం చేశాయి. 4 జైషే మహ్మద్, 3 లష్కరే తొయిబా ఉగ్రస్థావరాలపై ఈ దాడులు జరిగాయి. రెండు హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రస్థావరాలపై ఇండియన్ ఆర్మీ దాడులు చేశాయి. కోట్లీ, బహ్వాల్‌పూర్‌, మురిడ్కే, ముజఫరాబాద్‌లో దాడులు చేసింది. చాక్ అమ్రు, గుల్పూర్, భీంబర్, సియాల్‌కోట్‌పై దాడులు చేసింది.'ఆపరేషన్‌ సింధూర్‌'కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. 'ఆపరేషన్ సింధూర్‌'కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మద్దతు ప్రకటించారు. జైహింద్ అంటూ ఎక్స్‌లో ఏపీ సీఎం చంద్రబాబు పోస్ట్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa