ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పహల్‌గామ్ మృతులకు న్యాయం కోసం ఆపరేషన్ సిందూర్: కల్నల్ సోఫియా

national |  Suryaa Desk  | Published : Wed, May 07, 2025, 12:26 PM

పహల్‌గామ్ బాధితులకు న్యాయం అందించేందుకు భారత సైన్యం చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్' వివరాలను వెల్లడించేందుకు విదేశాంగ, రక్షణ శాఖలు బుధవారం ఢిల్లీలో సంయుక్త మీడియా సమావేశం నిర్వహించాయి. 
ఈ సందర్భంగా కల్నల్ సోఫియా ఖురేషి మాట్లాడుతూ, "పహల్‌గామ్‌లో మృతిచెందిన వారికి న్యాయం చేసేందుకే ఆపరేషన్ సిందూర్‌ను చేపట్టాం. గత 30 ఏళ్లుగా పాకిస్థాన్ ఉగ్రవాద మూకలకు సహకారం అందిస్తోంది. ఈ ఆపరేషన్‌లో పాకిస్థాన్‌లోని 9 ఉగ్ర శిబిరాలను లక్ష్యంగా చేసుకొని ధ్వంసం చేశాం. మొత్తం 21 ఉగ్ర స్థావరాలను పాకిస్థాన్, పీవోకేలో గుర్తించాం" అని తెలిపారు.
ఈ ఆపరేషన్ ద్వారా ఉగ్రవాదానికి సంబంధించిన పాకిస్థాన్ ఆధారిత నెట్‌వర్క్‌ను ఛిన్నాభిన్నం చేసేందుకు భారత్ కట్టుబడి ఉందని కల్నల్ సోఫియా స్పష్టం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa