ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విద్యుత్‌ ఛార్జీలు పెంచి ప్రజలపై భారం మోపుతున్నారు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, May 07, 2025, 12:27 PM

కూట‌మి ప్ర‌భుత్వం ఏర్పాట‌య్యాక రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి లేకపోగా ఛార్జీల మోత  మోగిస్తున్నార‌ని ఎన్టీఆర్ జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ మండిప‌డ్డారు. పెంచిన విద్యుత్ ఛార్జీలను తక్షణమే తగ్గించాలని కోరుతూ మంగ‌ళ‌వారం వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వ‌ర్యంలో విద్యుత్ నిలయాన్ని ముట్ట‌డించి ఆందోళ‌న చేప‌ట్టారు. అనంత‌రం సిఎండి కార్యాలయంలో అధికారులకు విన‌తిప‌త్రం అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడారు. `కూటమి ప్రభుత్వం ఎన్నిక‌ల ముందు ఇచ్చిన‌ హామీ ఇచ్చిన హామీలు అమ‌లు చేయ‌డంలో విఫ‌ల‌మైంది. పేద ప్రజల ఇబ్బందులు చూస్తుంటే బాధ వేస్తుంది. రెండు, మూడు వందలు వచ్చే కరెంట్ బిల్లు నేడు వేయి రూపాయలు దాటుతోంది. అధికారంలోకి వ‌చ్చాక చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు ప్రజలను మోసం చేశారు. ఇచ్చిన హామీ ప్రకారం విద్యుత్‌ ఛార్జీలు తగ్గించకుండా మరింతగా పెంచారు. ప్రజలకు అన్యాయం చేస్తూ ప్రభుత్వం అడుగులు వేస్తుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ధరలు పెంచం, ఛార్జీలు పెంచ‌మ‌ని ప్ర‌జ‌ల‌కు బాండ్ పేపర్లు ఇచ్చారు. అధికారంలోకి వ‌చ్చాక మొహం చాటేశారు.  ప్రజలను మోసం చేసిన నాయకులపై భవిష్యత్ లో పోలీసులకు ఫిర్యాదు కూడా చేస్తాం అని హెచ్చరించారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa