మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మంగళవారం వీర జవాన్ మురళీ నాయక్ కుటుంబాన్ని పరామర్శించారు. ‘ఆపరేషన్ సిందూర్’లో భాగంగా జమ్ముకశ్మీర్లో పాకిస్తాన్ దాడిలో వీరమరణం పొందిన జవాన్ . ఈరోజు ఉదయం బెంగళూరులోని నివాసం నుంచి బయలుదేరి.. మురళీ స్వగ్రామం కల్లితండాకు చేరుకొని వీరజవాన్ తల్లిదండ్రులు శ్రీరాంనాయక్, జ్యోతిబాయిని పరామర్శించారు. అలాగే వైసీపీ తరఫున జగన్ రూ.25 లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు.వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ… మురళీ నాయక్ జీవితం స్ఫూర్తిదాయకం అని పేర్కొన్నారు. మురళీ చేసిన త్యాగానికి దేశం రుణపడి ఉందన్నారు. ‘వీరజవాన్ మురళీ నాయక్ జీవితం స్ఫూర్తిదాయకం. మురళీ త్యాగానికి ప్రజలంతా రుణపడి ఉండాలి. ఇక జనసేన ప్రభుత్వం రూ.50 లక్షలు, తెలుగుదేశం పార్టీ 5 ఎకరాల భూమిని మురళీ నాయక్ కుటుంబానికి కేటాయించింది. కాగా భారత్-పాకిస్తాన్ దాడుల్లో వీరమరణం చెందిన సంగతి తెలిసిందే. ఆదివారం మురళీ అంత్యక్రియలు అనంతపురం జిల్లా గోరంట్లలో ప్రభుత్వ లాంఛనాలతో ముగిసాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa