తిరుమల శ్రీవారి భక్తుల సౌకర్యార్థం తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఒక భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. అలిపిరి పాదాల చెంత అత్యాధునిక వసతులతో కూడిన ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ నిర్మాణానికి బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. కొండపై రద్దీని తగ్గించడంతో పాటు, సామాన్య భక్తులకు తిరుపతిలోనే మెరుగైన వసతి కల్పించడమే ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ భారీ నిర్మాణాన్ని చేపట్టనున్నారు.
ఈ మెగా ప్రాజెక్టును సుమారు 4వేల కోట్ల రూపాయల భారీ వ్యయంతో నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఒకేసారి దాదాపు 25వేల మంది భక్తులు బస చేసేలా దీని కెపాసిటీని రూపొందిస్తున్నారు. పర్యావరణ హితంగా, ఆధ్యాత్మిక ఉట్టిపడేలా ఉండే ఈ టౌన్షిప్ నిర్మాణానికి సంబంధించిన డిజైన్లు ఇప్పటికే తుది దశకు చేరుకున్నాయి. దీనివల్ల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు వసతి కోసం పడే ఇబ్బందులు శాశ్వతంగా తొలగిపోయే అవకాశం ఉంది.
ఈ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్లో భక్తులకు అవసరమైన అన్ని రకాల సదుపాయాలు ఒకే చోట లభించనున్నాయి. ఇందులో వేలాది ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, క్లీన్ అండ్ హైజీనిక్ బాత్రూమ్లు, భక్తుల సామాను భద్రపరుచుకోవడానికి లాకర్లు అందుబాటులో ఉంటాయి. అలాగే పెద్ద ఎత్తున అన్నప్రసాద వితరణ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. సామాన్య భక్తుల నుంచి విఐపిల వరకు అందరికీ సౌకర్యంగా ఉండేలా ఈ సముదాయాన్ని తీర్చిదిద్దనున్నారు.
కేవలం వసతి గదులే కాకుండా, భక్తుల వినోదం మరియు విశ్రాంతి కోసం మరిన్ని అదనపు హంగులను జోడిస్తున్నారు. ప్రైవేటు రెస్టారెంట్లు, ఆహ్లాదకరమైన పార్కులు, ఆధ్యాత్మిక ప్రసంగాలు మరియు కార్యక్రమాల కోసం ప్రత్యేక ఆడిటోరియం ఈ ప్రాజెక్టులో భాగంగా ఉంటాయి. భక్తులు తమ వంతు దర్శనం వచ్చే వరకు వేచి ఉండే సమయంలో ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఈ టౌన్షిప్ ఒక మినీ సిటీలా సేవలందించనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa