ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రెండోందల అడుగుల పాడుపడ్డ గుహలోకి కెమెరా.. లోపల ఏముందో చూసి బిత్తరపోయారు

national |  Suryaa Desk  | Published : Sat, May 17, 2025, 07:59 PM

నేటి ప్రపంచంలో.. సోషల్ మీడియా మన జీవితాల్లో ఒక అంతర్భాగంగా మారింది. సమాచార వ్యాప్తి వేగంగా జరుగుతోంది. ప్రజలు తమ అభిప్రాయాలను పంచుకోవడానికి, ఇతరులతో కనెక్ట్ అవ్వడానికి.. సమాచారాన్ని సేకరించడానికి.. సృజనాత్మకతను ప్రదర్శించడానికి దీన్ని ఒక శక్తివంతమైన వేదికగా ఉపయోగిస్తున్నారు. యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ , ఫేస్‌బుక్ వంటి వేదికల ద్వారా చాలా మంది రాత్రికి రాత్రే సెలబ్రిటీలుగా మారుతున్నారు. తమ ప్రతిభను, ఆలోచనలను ప్రపంచానికి చాటుతున్నారు. అయితే.. కొంతమంది సోషల్ మీడియాలో షేర్ చేసే వీడియోలు వింతగా, భయానకంగా ఉంటున్నాయి. దానికి సంబంధించే ఓ వీడియో నెటిజన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.. అక్కడ ఏం జరిగింది.. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.


ఇటీవల... అమెరికాలో కొందరు స్నేహితులు సాహసం కోసం పాడుబడిన బొగ్గు గనులను అన్వేషించాలని నిర్ణయించుకున్నారు. పర్యాటకులు సంచరించని, నిర్మానుష్యమైన ప్రదేశాన్ని ఎంచుకున్నారు. గని ప్రవేశ ద్వారం దగ్గరకు చేరుకున్నాక.. వారికి లోపల నుండి వింత శబ్దాలు వినిపించాయి. మొదట్లో వారు వాటిని పెద్దగా పట్టించుకోలేదు, కాని శబ్దాలు పెరుగుతుండటంతో భయపడ్డారు.


వారిలో ఒకరు ఆసక్తి కొద్దీ కెమెరా ఆన్ చేసి రికార్డ్ చేయడం మొదలుపెట్టాడు. కొన్ని నిమిషాల తర్వాత.. కెమెరా ఫుటేజీలో గుహ లోపల ఒక నల్లటి ఆకారం కదులుతున్నట్లు కనిపించింది. అది మనిషిలా కాకుండా ఏదో వింత జంతువులా అనిపించింది. ఆ ఆకారం దగ్గరకు వస్తుండటంతో వారు భయంతో వణికిపోయారు. ఆ గుహ దాదాపు 200 అడుగుల వరకు ఉండే అవకాశం ఉంది.


అసలు అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకునే సాహసం చేయలేక.. ప్రాణాల కోసం పరుగు తీశారు. పరిగెడుతున్నప్పుడు కూడా ఆ శబ్దాలు వారిని వెంబడిస్తూనే ఉన్నాయి. గని నుండి బయటకు వచ్చాక కాని వారు ఊపిరి పీల్చుకోలేదు. దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.


ఆ అనుభవం వారిని కొన్ని రోజుల పాటు వెంటాడింది. రాత్రిళ్లు నిద్ర పట్టక ఉలిక్కిపడి లేచేవారు. ఈ సంఘటన పాడుబడిన ప్రదేశాలలో ఉండే ప్రమాదాలను తెలియజేస్తుంది. సాహస యాత్రల పేరుతో తెలియని ప్రదేశాలకు వెళ్లడం కొన్నిసార్లు ప్రాణాలకే ప్రమాదంగా పరిణమిస్తుంది. ఇలాంటి ప్రదేశాల్లో విష వాయువులు, ప్రమాదకర జంతువులు లేదా నిర్మాణాలు కూలిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. అందుకే చాలా జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.


సోషల్ మీడియా ద్వారా విద్యార్థులు, నిపుణులు తమ జ్ఞానాన్ని, నైపుణ్యాలను ఒకరితో ఒకరు పంచుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న విషయాలను తెలుసుకోవడానికి సహాయపడుతుంది. అనేక మంది యువకులు తమ కళాత్మక, సాంకేతిక నైపుణ్యాలను ప్రదర్శించడానికి, మెరుగుపరుచుకోవడానికి సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నారు. ఇది కొత్త కెరీర్ అవకాశాలను అందిస్తుంది.


అయతే.. సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు, పుకార్లు చాలా త్వరగా వ్యాప్తి చెందుతాయి. ఆన్‌లైన్ వేధింపులు, సైబర్ బెదిరింపులు యువత మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ఇది ఆత్మహత్యలకు కూడా దారితీస్తుంది. ఎక్కువ సమయం సోషల్ మీడియాలో గడపడం వల్ల నిద్రలేమి, ఒంటరితనం, ఆందోళన వంటి సమస్యలు కూడా వస్తాయి. మంచికి ఉపయోగించుకొని.. చెడును పక్కన పెడితే.. సోషల్ మీడియా ద్వారా ఎన్నో అద్భుతమైన విషయాలను తెలుసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa