నేడు భారత ఆర్మీ కీలక ప్రకటన విడుదల చేసింది. ఈరోజుతో పాకిస్తానుతో సీజ్ఫైర్ ముగుస్తుందన్న వార్తలను ఖండించింది. ఇండియా, పాకిస్థాన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (డీజీఎంఓ)ల మధ్య ఇవాళ ఎలాంటి చర్చలకు ప్లాన్ చేయలేదని తెలిపింది. కాల్పుల విరమణ అవగాహనకు ముగింపు తేదీ లేదని ప్రకటించింది. ఈ నెల 12న ఇరు దేశాల డీజీఎంఓల చర్చల్లో తీసుకున్న నిర్ణయాలే ప్రస్తుతానికి కొనసాగుతాయని ఇండియన్ ఆర్మీ స్పష్టం చేసింది.ఇక, పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత బలగాలు చేపట్టిన ఆపరేషన్ సిందూర్తో దాయాది పాకిస్థాన్ వణికిపోయిన విషయం తెలిసిందే. ఎదురుదాడికి ప్రయత్నించినప్పటికీ భారత బలగాల దెబ్బకు తోకముడిచింది. చివరకు ఉద్రిక్తతలు తగ్గించాలని దాయాది దేశం కాళ్ల బేరానికి రావడంతో భారత్ అంగీకరించింది. దాంతో కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది. వీటికి సంబంధించి మే 12న ఇరు దేశాల డీసీఎంఓల స్థాయిలో చేసుకున్న తాత్కాలిక కాల్పుల విరమణ అవగాహనను కొనసాగించేందుకు మొగ్గు చూపినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa