ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చార్మినార్ అగ్ని ప్రమాదం.. ప్రధాని మోదీ నుంచి ఎక్స్‌గ్రేషియా ప్రకటన

national |  Suryaa Desk  | Published : Sun, May 18, 2025, 01:11 PM

హైదరాబాద్ చార్మినార్ సమీపంలో చోటుచేసుకున్న భారీ అగ్ని ప్రమాదం దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 17 మంది ప్రాణాలు కోల్పోయినట్టు అధికారిక వర్గాలు వెల్లడించాయి. అనేకమంది తీవ్రంగా గాయపడినట్లు సమాచారం.
ఈ హృదయవిదారక ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వం తరఫున మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా (ఆర్థిక సహాయం)ను ప్రకటించారు. అలాగే ఈ ప్రమాదంలో గాయపడిన వారికి రూ.50 వేలు ఎక్స్‌గ్రేషియా అందజేస్తామని తెలిపారు.
ఇదిలా ఉంటే, ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీఆర్ఎస్ నేత కేటీఆర్ సంఘటనపై ఆరా తీశారు. బాధిత కుటుంబాలకు అన్ని విధాలుగా సహాయం అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఘటనాస్థలంలో సహాయక చర్యలు కొనసాగుతుండగా, అగ్ని ప్రమాదానికి కారణాలపై దర్యాప్తు ప్రారంభమైంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa