పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. సీనియర్ ఆటగాళ్లు బాబర్ ఆజామ్, మహమ్మద్ రిజ్వాన్, షాహీన్ అఫ్రిదిలు లేకుండానే టీ20ను ప్రకటించింది. పాకిస్తాన్ సూపర్ లీగ్లో ఆటగాళ్ల ప్రదర్శన ఆధారంగా ఓ నూతన జట్టును పీసీబీ ఎంపిక చేసింది. బంగ్లాదేశ్తో జరిగే టీ20 సిరీస్ కోసం 16 మందితో కూడిన స్క్వాడ్ను పీసీబీ సెలక్ట్ చేసింది.
సల్మాన్ అలీ అఘా సారథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు టీ20 స్క్వాడ్ను ప్రకటించింది. ఐసీసీ టీ20 వరల్డ్కప్ 2026ను దృష్టిలో ఉంచుకుని పీసీబీ సీనియర్లను పక్కనబెట్టి యువకులతో జట్టును సిద్ధం చేసినట్టుంది. అందుకే బాబర్ ఆజామ్, మహమ్మద్ రిజ్వాన్, షాహీన్ అఫ్రిదీలను పాక్ క్రికెట్ బోర్డు పక్కన పెట్టింది.
సల్మాన్ అఘాతో షాబాద్ ఖాన్కు కూడా జట్టులో అవకాశం కల్పించడమే కాకుండా వాళ్లిద్దర్నీ కెప్టెన్, వైస్ కెప్టెన్గా ప్రకటించింది. అదేవిధంగా ఫకర్ జమాన్, హారీశ్ రావూఫ్, నసీమ్ షా కూడా వెనక్కి వచ్చారు. కాలిమడమ గాయం నుంచి కోలుకున్న సైమ్ అయూబ్కు కూడా అవకాశం కల్పించారు.
ఇటీవల జరిగిన పాకిస్తాన్ సూపర్ లీగ్లో రాణించిన ఫర్హాన్కు కూడా పీసీబీ ఛాన్స్ ఇచ్చింది. ఫర్హాన్ పాకిస్తాన్ తరఫున చివరగా 2018లో టీ20లు ఆడాడు. 29 సంవత్సరాల ఫర్హాన్ 154.5 స్ట్రయిక్రేట్తో 394 పరుగులు చేశాడు. పాకిస్తాన్ నూతన కోచ్గా మైక్ హెస్సన్ బాధ్యతలు తీసుకున్న తర్వాత జట్టులో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ఇటీవల కాలంలో అంతర్జాతీయ వేదికలపై పాకిస్తాన్ జట్టు దారుణ పరాభవాలు పొందింది. ఛాంపియన్స్ ట్రోఫీలోనూ లీగ్ దశలోనే ఇంటిబాట పట్టింది.
పాకిస్తాన్ స్క్వాడ్
సల్మాన్ అలీ అఘా (కెప్టెన్), షాబాద్ ఖాన్ (వైస్ కెప్టెన్), అబ్రార్ అహ్మద్, ఫహీమ్ అష్రఫ్, ఫకర్ జమాన్, హారీశ్ రావూఫ్, హసన్ అలీ, హసన్ నవాజ్, హుస్సేన్ తలాత్, ఖుష్ దిల్ షా, మహమ్మద్ హారీశ్, మహమ్మద్ వసీమ్ జూనియర్, మహమ్మద్ ఇర్ఫాన్ ఖాన్, నసీమ్ షా, షాహీబ్జదా ఫర్హాన్, సైమ్ అయూబ్.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa