కడపలో టీడీపీ మహానాడు మే 27 నుంచి ఘనంగా ప్రారంభం కానుంది. వైఎస్సార్ జిల్లాలో తొలిసారిగా జరుగుతున్న ఈ కార్యక్రమ ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు ఇవాళ సాయంత్రం, మంత్రి నారా లోకేశ్ కుప్పం నుంచి కడపకు చేరుకోనున్నారు. పార్టీ తోరణాలు, ఫ్లెక్సీలతో మహానాడు ప్రాంగణం, కడప, కమలాపురం పసుపుమయమయ్యాయి. కమలాపురం నియోజకవర్గం పబ్బాపురం సమీపంలో 150 ఎకరాల్లో ఈ కార్యక్రమం జరుగనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa