పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం కారణంగా గల్ఫ్ దేశాలకు అరటి ఎగుమతులు నిలిచిపోవడంతో రాష్ట్రంలోని అరటి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. కేవలం రెండు వారాల్లోనే అరటి టన్ను ధర రూ.20-23వేల నుంచి రూ.6-8వేలకు పడిపోయింది. స్థానికంగానూ వ్యాపారులు కొనుగోలు చేయడానికి ముందుకు రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాయలసీమ ప్రాంతంలో సుమారు లక్ష ఎకరాల్లో అరటి సాగు జరుగుతోంది. యుద్ధం ఇలాగే కొనసాగితే ధరలు మరింత పడిపోతాయని రైతులు అంచనా వేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa