ఐపీఎల్ 2025లో భాగంగా సోమవారం పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ తర్వాత జరిగిన ఓ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇందులో ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ.. పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ను ఇమిటేట్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.
ఈ మ్యాచులో ముంబై ఇండియన్స్ను ఓడించిన పంజాబ్ కింగ్స్.. క్వాలిఫయర్-1 ఆడేందుకు అర్హత సాధించింది. అయితే మ్యాచ్ తర్వాత ఆటగాళ్లంతా షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. అయితే ఇంపాక్ట్ ప్లేయర్గా అశ్వనీ కుమార్.. రోహిత్ శర్మ ప్లేసులో తుది జట్టులోకి వచ్చాడు. దీంతో రోహిత్.. డ్రెస్సింగ్ రూమ్కి వెళ్లిపోయాడు. మ్యాచ్ తర్వాత ప్రత్యర్థి జట్టును అభినందించేందుకు మైదానంలోకి వచ్చాడు. అయితే వస్తూ వస్తూ శ్రేయస్ అయ్యర్ కనిపించగానే ఫన్నీగా ప్రవర్తించాడు. శ్రేయస్ అయ్యర్ వాకింగ్ స్టైల్ను ఇమిటేట్ చేసేందుకు ప్రయత్నించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ముంబై ఇండియన్స్ జట్టు సోషల్ మీడియాలో పోస్టు చేసింది.
ఈ వీడియోను చూసిన నెటిజన్లకు రోహిత్ ఎందుకిలా చేశాడో అర్థమైపోయింది. అయ్యర్ను ఆటపట్టించేందుకే అతడు ఇలా చేశాడని తెలుసుకుని.. ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. మీరెందుకు అలా చేశారో తెలుసు శర్మా జీ.. అని పేర్కొంటున్నారు. నవ్వుతున్న ఎమోజీలను షేర్ చేస్తున్నారు.
ఐపీఎల్ 2025లో శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్.. 11 ఏళ్ల తర్వాత ప్లే ఆఫ్స్కు అర్హత సాధించింది. ఆ జట్టు ముంబైపై గెలిచి క్వాలిఫయర్-1కు అర్హత సాధించింది. ఇవాళ ఆర్సీబీ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్ జరగనుంది. ఇందులో ఆర్సీబీ గెలిస్తే.. మే 29న పంజాబ్ కింగ్స్తో క్వాలిఫయర్లో తలపడనుంది. ఓడిపోతే పంజాబ్- గుజరాత్ జట్ల మధ్య ఈ మ్యాచ్ జరుగుతుంది. మే 30న ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది. జూన్ 1న క్వాలిఫయర్ 2, జూన్ 3న ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa