మహారాష్ట్రలోని ఓ ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీలో రెండో సంవత్సరం చదువుతున్న 19 ఏళ్ల విద్యార్థిని సోషల్ మీడియా వేదికగా ఆపరేషన్ సిందూర్పై విమర్శనాత్మక పోస్ట్ చేసింది. ఈ విషయం గుర్తించిన పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆమె జైల్లో ఉండగా.. ఇటీవలే హైకోర్టును ఆశ్రయించింది. సెమిస్టర్ పరీక్షలు జరుగుతున్నా తనను అనుమతించడం లేదని పిటిషన్లో పేర్కొంది. అయితే నేడు విచారణ జరిపిన న్యాయస్థానం షాకింగ్ కామెంట్లు చేసింది. మహారాష్ట్ర సర్కారుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూనే.. మనసులోని మాటలు చెప్పినంత మాత్రాన ఆమె జీవితం నాశనం చేస్తారా అని ప్రశ్నించింది. అలాగే ఆమెను వెంటనే విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
అసలేం జరిగిందంటే..?
పుణేలోని సింహగడ్ అకాడమీ ఆఫ్ ఇంజినీరింగ్లో రెండో సంవత్సరం ఐటీ విద్యార్థిని ఖదీజా షేక్.. మే 7వ తేదీన 'ఆపరేషన్ సిందూర్'పై సోషల్ మీడియాలో విమర్శనాత్మకంగా పోస్ట్ పెట్టింది. అయితే నెటిజెన్ల నుంచి తీవ్ర విమర్శలు రాగా.. రెండు గంటల్లోనే వాటిని డిలీట్ చేసింది. అలాగే తాను చేసిన తప్పుకు క్షమాపణలు కూడా చెప్పింది. అయితే పలువురు దాన్ని స్క్రీన్ షాట్లు తీసి షేర్ చేశారు. అలా ఈ విషయం కాస్తా పోలీసుల వరకు వెళ్లింది. దీంతో వారు ఖదీజా షేక్ను మే 9న తేదీన అరెస్ట్ చేశారు. అలాగే కాలేజీ యాజమాన్యం సైతం ఆమెను సస్పెండ్ చేసింది. ఇక అప్పటి నుంచి ఆమె ఎరవాడ జైల్లోనే ఉంటోంది. ఈక్రమంలోనే ఆమె హైకోర్టును ఆశ్రయించారు. సెమిస్టర్ పరీక్షలు జరుగుతున్నాయని.. ఈ పిటిషన్ను వెంటనే విచారించాలని ఆమె తరఫు న్యాయవాది కోర్టును అభ్యర్థించారు.
అయితే ఇది చూసిన బాంబే హైకోర్టు దాన్ని పరిగణలోకి తీసుకునేందుకు అంగీకరించింది. నేడు విచారణ జరిపింది. ఈక్రమంలోనే మహారాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమెను వెంటనే విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఒక వ్యక్తి అభిప్రాయాన్ని వ్యక్తం చేసినంత మాత్రానా అరెస్ట్ చేయలేరని అసహనం వ్యక్తం చేసింది. ఇదేం ప్రవర్తన అంటూ న్యాయమూర్తులు గౌరీ గాడ్సే మరియు సోమశేఖర్ సుందరేశన్లతో కూడిన బెంచ్ ప్రశ్నించింది. ఒక విద్యార్థి జీవితాన్ని నాశనం చేస్తున్నారా అని అడిగింది. ఆమెను అసలు వివరణ కోరరా అంటూ ప్రశ్నలు వేసింది.
ఇక ఆమె పోలీసుల భద్రతతో పరీక్షలకు హాజరు కావొచ్చని కళాశాల తరఫు న్యాయవాది వాదించగా.. సుప్రీం మరోసారి ఫైర్ అయింది. ఆ వాదనలను తోసి పుచ్చుతూనే.. ఖదీజా షేక్ నేరస్థురాలు కాదని పేర్కొంది. ఒకవేళ ఆమెను విడుదల చేయడంలో ఆలస్యం జరిగితే.. సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేసింది. అలాగే విద్యా సంస్థలు విద్యార్థులను శిక్షించడానికి కాకుండా.. వారికి మార్గనిర్దేశం చేయడానికి ఉండాలని పేర్కొంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa