ఈజీ మనీకి అలవాటు పడిన కొందరు మోసాలకు అలవాటుపడుతున్నారు. అమాయకులను టార్గెట్ చేసుకొని నిండా ముంచుతున్నారు. తమను తాము గొప్ప వ్యక్తులుగా పరిచయం చేసుకొని అవతలి వాళ్లు చాలు సులభంగా బురిడీ కొట్టిస్తున్నారు. ముఖ్యంగా అబ్బాయిలు, అమ్మాయిలు అనే తేడా లేకుండా టానీ ట్రాప్ ద్వారా మోసాలు చేస్తున్నారు. తాజాగా ఓ కీలేడీ లేడీ చీకటి బాగోతం వెలుగులోకి వచ్చింది. తనను తాను ఐఏఎస్ అధికారిని, డాక్టర్, డీఎస్పీ కూతురు అంటూ వివిధ వేషధారణలతో యువకులను మోసం చేసి లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్న కిలాడీ లేడీ సరిత అలియాస్ ప్రత్యూషను పోలీసులు అరెస్టు చేశారు. ఆమె మోసాల పరంపర, చోరీల చరిత్ర చూసి పోలీసులు సైతం షాక్కు గురయ్యారు.
నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం లావుడితండాకు చెందిన సరిత.. మొదట విద్యార్థిని ముసుగులో హాస్టళ్లలో ఉంటూ తోటి యువతుల సెల్ ఫోన్లు, నగదు దొంగిలించేది. ఆ తర్వాత డబ్బున్న వారిని లక్ష్యంగా చేసుకుని, తాను డాక్టర్, ఐఏఎస్, డీఎస్పీ కూతురు అంటూ రకరకాల హోదాలను చెప్పుకుంటూ మోసాలకు పాల్పడటం మొదలుపెట్టింది. ఏడాది క్రితం ఒక వైద్యుడిని ఇలాగే బెదిరించి రూ. 5 లక్షలు వసూలు చేసింది. మరో యువకుడిని ట్రాప్ చేసి అడిగినంత డబ్బు ఇవ్వకపోతే చంపేస్తానని బెదిరించి మరీ డబ్బులు వసూలు చేసింది. మూడు రోజుల క్రితం 'డయల్ 100'కు ఫోన్ చేసి తాను డీఎస్పీ సతీమణిని అంటూ ఒకసారి, యువతి హత్య జరిగిందని మరోసారి తప్పుడు సమాచారం ఇచ్చి పోలీసులను ఆటపట్టించింది.
నిన్న (మే 27) ఒక చోరీ కేసులో సరితను అరెస్టు చేయగా.. విచారణలో ఆమె మోసాల చిట్టా బయటపడింది. సరితపై చైతన్యపురి, ఉప్పల్, నల్గొండ టూ టౌన్, మిర్యాలగూడ వన్ టౌన్, నార్కట్పల్లి, నల్గొండ పోలీస్ స్టేషన్లలో ఇప్పటికే పలు చోరీ కేసులు నమోదయ్యాయి. దీంతో పోలీసులు ఆమెను రిమాండ్కు తరలించారు. ఆమె మోసాల బారిన పడిన మరికొంత మంది బాధితులు కంఫ్లైంట్ చేసేందుకు ముందుకు వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. కాగా, ఇలాంటి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. సులభంగా డబ్బులు సంపాదించేందుకు చాలా మంది ఇలాంటి మార్గాలను ఎంచుకుంటున్నారని వాస్తవాలు తెలుసుకోకుండా మోసపోవద్దని సూచిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa