రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ, కార్యకర్తల కృషితోనే గత ఎన్నికల్లో జిల్లాలో టీడీపీ కూటమి మంచి ఫలితాలు సాధించిందని అన్నారు. "నేడు చంద్రబాబు పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉంది. ఈ ప్రాంతం నుంచి వెళ్లి ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్ రెడ్డి ఈ ప్రాంత ప్రజలకు చేసిందేమీ లేదు. టీడీపీ కార్యకర్తలను హింసించడం, హత్యారాజకీయాలు చేయడం తప్ప" అని ఆరోపించారు. వైఎస్ కుటుంబం దగ్గర ఉంటే చివరకు హింసే దక్కిందని, అందుకే వారిని వ్యతిరేకించి టీడీపీలోకి వచ్చామని, ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. టీడీపీతోనే ఈ ప్రాంత ప్రజలకు మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డారు. అన్న ఎన్టీఆర్ శంకుస్థాపన చేసిన హంద్రీనీవా, గాలేరు ప్రాజెక్టులను చంద్రబాబే ఒక రూపానికి తెచ్చారని గుర్తుచేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa