ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గుజరాత్‌తో ఎలిమినేటర్‌ మ్యాచ్.. సాహసం చేసిన పాండ్యా

sports |  Suryaa Desk  | Published : Fri, May 30, 2025, 08:53 PM

గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న ఐపీఎల్‌ 2025 ఎలిమినేటర్‌లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి ఫస్టు బ్యాటింగ్ ఎంచుకుంది. తాము తొలుత బ్యాటింగ్ చేసి.. గుజరాత్‌ ముందు భారీ టార్గెట్ నిర్దేశించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా చెప్పాడు. అయితే ఇదే వేదికగా గురువారం పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. అయితే ఇందులో టాస్ గెలిచిన ఆర్సీబీ.. ఫస్టు బౌలింగ్ ఎంచుకుని సక్సెస్ అయింది. కానీ ముంబై మాత్రం అనూహ్యంగా బ్యాటింగ్ ఎంచుకుని ఆశ్చర్యపరిచింది.


ఇక కీలక ప్లేయర్లు అంతర్జాతీయ క్రికెట్ ఆడేందుకు తమ దేశాలకు వెళ్లిపోవడంతో ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు తమ తుది జట్లలో మార్పులు చేశాయి. ముంబై ఇండియన్స్ మూడు, గుజరాత్ టైటాన్స్ రెండు మార్పులతో బరిలోకి దిగాయి. జానీ బెయిర్‌స్టో, గ్లీసన్, రాజ్‌ బవాను ముంబై తుది జట్టులోకి తీసుకుంది. అటు గుజరాత్ టైటాన్స్.. కుశాల్ మెండిస్, వాషింగ్టన్ సుందర్‌ను ప్లేయింగ్ ఎలెవన్‌లో చేర్చింది. ఇక క్వాలిఫయర్-1లో గెలిచి ఆర్సీబీ ఇప్పటికే ఫైనల్ చేరింది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు క్వాలిఫయర్‌-2లో పంజాబ్ కింగ్స్‌తో తలపడనుంది.


తుది జట్లు ఇవే..


ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ, జానీ బెయిర్‌స్టో (వికెట్ కీపర్‌), సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్‌), నమన్ ధీర్, రాజ్ బావా, మిచెల్ శాంట్నర్‌, ట్రెంట్ బౌల్ట్, జస్‌ప్రీత్ బుమ్రా, రిచర్డ్ గ్లీసన్గు జరాత్ టైటాన్స్‌: శుభమన్ గిల్ (కెప్టెన్‌), సాయి సుదర్శన్, కుశాల్ మెండిస్ (వికెట్ కీపర్‌), షారుక్ ఖాన్, వాషింగ్టన్ సుందర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, సాయి కిషోర్, గెరాల్డ్ కోయెట్జీ, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ కృష్ణ ఇంపాక్ట్ సబ్స్: షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, అనుజ్ రావత్, మహిపాల్ లోమ్రోర్, జయంత్ యాదవ్, అర్షద్ ఖాన్.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa