ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ డీజీపీకి లేఖ వ్రాసిన భాను ప్రకాష్ రెడ్డి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jun 01, 2025, 03:05 PM

తిరుమల తిరుపతి దేవస్థానంపై వైసీపీ అబద్దపు ప్రచారం చేస్తుందని  ఆ బోర్డు పాలక మండలి సభ్యుడు, బీజేపీ నేత భాను ప్రకాష్ రెడ్డి ఆరోపించారు. ఈ వ్యవహారంపై విచారణ చేపట్టాలని ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు ఆదివారం ఆయన లేఖ రాశారు. గోశాల నుంచి గోవిందుడి వరకు అబద్ధపు ప్రచారం చేస్తోందంటూ వైసీపీపై ఆయన మండిపడ్డారు. తిరుమలలో జరుగుతున్న వరుస ఘటనలు వెనుక వైసీపీ కట్ర కోణం ఉందని ఆయన ఆరోపించారు. తిరుమల ప్రతిష్టను దిగజార్చే విధంగా కుట్రలు చేస్తున్న వైసీపీ నేతలపై పోలీస్ కేసులు నమోదు చేయాలని ఈ సందర్బంగా ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.ఇంతకీ ఏం జరిగిందంటే.. తాజాగా శ్రీవారి దర్శనం కోసం క్యూ లైన్‌లో ఉన్న కాకినాడకు చెందిన ఓ భక్తుడు.. టీటీడీ చైర్మన్, ఈవోలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వ్యవహారంపై టీటీడీ విచారణ జరిపింది. అందులోభాగంగా సదరు భక్తుడుని విచారించింది. ఈ సందర్భంగా టీటీడీకి వ్యతిరేకంగా నినాదాలు చేసి తాను తప్పు చేశానని ఒప్పుకున్నాడు. అంతేకాకుండా.. టీటీడీని సదరు భక్తుడు క్షమాపణలు కోరాడు. అయితే ఈ వీడియో వైసీపీ వారే ఈ వీడియోను చిత్రీకరించారనే ఓ చర్చ సాగుతుంది. అలాంటి వేళ.. టీటీడీ బోర్డు సభ్యుడు భాను ప్రకాశ్ రెడ్డి పై విధంగా స్పందించారు. కాగా భక్తులకి జరుగుతున్నా లోపాలని చూపడం కూడా తప్పేనా అని కొందరు అభిప్రాయపడుతున్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa