ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇకపై ప్రజలకి నచ్చిన సమయంలో రేషన్ సరుకులు తెచ్చుకోవచ్చు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jun 01, 2025, 03:15 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆదివారం రేషన్ షాపుల ద్వారా సరుకుల పంపిణీ  ఓ పండుగలా ప్రారంభమైందని, ప్రజలు పదిహేను రోజుల పాటు తమకు నచ్చిన సమయాల్లో సరుకులు తీసుకోవచ్చునని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పేర్కొన్నారు. రేషన్ సరుకుల పంపిణీలో భాగంగా ఎమ్మెల్యే పటమట జెడీ నగర్‌లో ప్రజలకు రేషన్ సరుకులు పంపిణీ చేశారు. ఓ దివ్యాంగురాలి ఇంటికి వెళ్లి ఆయన స్వయంగా బియ్యం, పంచదార అందచేశారు. గద్దె రామ్మోహన్ వెంట కార్పొరేటర్ ముమ్మనేని ప్రసాద్, ఎయస్‌వో శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa