ఇవాళ ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ ఆడుతున్న ఆర్సీబీకి కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఈసారి కప్ బెంగళూరుదేనని ఈ సందర్భంగా ఆయన ధీమా వ్యక్తం చేశారు. 18 ఏళ్ల పోరాటంలో ప్రతి ప్రార్థన, ఎంకరేజ్మెంట్, బాధ ఈ రోజు కోసమే అంటూ ఆయన ఓ వీడియోను అభిమానులతో పంచుకున్నారు. "ఈసారి కప్ మనదే! 18 సంవత్సరాల పోరాటం. ప్రతి ప్రార్థన, ప్రతి ఉత్సాహం, ప్రతి హృదయ విదారకం ఇవన్నీ ఈ రోజు కోసమే. ఇది ఒక మ్యాచ్ కంటే ఎక్కువ. మన క్షణం. మన కప్. ఆల్ ది వెరీ బెస్ట్ ఆర్సీబీ. కర్ణాటక ప్రజలంతా మీతోనే ఉన్నారు" అని చెబుతూ డీకే శివకుమార్ ఓ వీడియో రిలీజ్ చేశారు. ప్రస్తుతం డిప్యూటీ సీఎం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా... ఆర్సీబీ ఫ్యాన్స్ తమదైనశైలిలో స్పందిస్తున్నారు. ఈసారి తప్పకుండా ఐపీఎల్ ట్రోఫీ ఆర్సీబీదేనంటూ కామెంట్స్ చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa