పాకిస్థాన్లోని కరాచీ నగరంలో తీవ్ర కలకలం రేగింది. కరడుగట్టిన నేరస్తులకు నిలయమైన మాలిర్ జైలు నుంచి పెద్ద సంఖ్యలో ఖైదీలు తప్పించుకున్నారు. నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత జైలు లోపల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఖైదీలు భద్రతా సిబ్బందితో తీవ్రంగా ఘర్షణపడి, జైలు ప్రధాన ద్వారాలను బద్దలుకొట్టి పారిపోయినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనతో కరాచీ వ్యాప్తంగా భయాందోళనలు, ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, దాదాపు 200 మంది ఖైదీలు జైలు నుంచి తప్పించుకున్నట్లు తెలుస్తోంది. జైలులో ఖైదీలు ఒక్కసారిగా పోలీసు అధికారులపై దాడికి దిగి, వారిని గాయపరిచి ఈ దారుణానికి ఒడిగట్టారని సమాచారం. ఈ క్రమంలో జైలు ప్రాంగణంలో పెద్ద ఎత్తున కాల్పులు కూడా జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. ఖైదీల దాడిలో తీవ్రంగా గాయపడిన ఒక పోలీసు అధికారి పరిస్థితి విషమంగా ఉందని అధికార వర్గాలు తెలిపాయి.ఘటన జరిగిన వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు, తప్పించుకున్న ఖైదీల కోసం ముమ్మర గాలింపు చర్యలు చేపట్టాయి. ఇప్పటివరకు సుమారు 20 మంది ఖైదీలను తిరిగి అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. మిగిలిన వారి కోసం వేట కొనసాగుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa