ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నీళ్లు విషయంపై పాకిస్తాన్ దుష్ప్రచారం, తిప్పికొట్టిన అస్సాం ముఖ్యమంత్రి

international |  Suryaa Desk  | Published : Tue, Jun 03, 2025, 03:54 PM

సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసిన భారత ప్రభుత్వం పాకిస్థాన్ కు నీళ్లు ఆపేసిన విషయం తెలిసిందే. దీంతో పాకిస్థాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ ఎండిపోతోంది. రెండు కీలక డ్యామ్ లలో నీటిమట్టం కనీస స్థాయికి దిగువకు చేరింది. భారత్ సింధూ నది జలాలను వదలకపోతే ఈసారి సాగు కష్టమేనని అక్కడి రైతులతో పాటు పాక్ ప్రభుత్వం కూడా ఆందోళన చెందుతోంది. ఈ నేపథ్యంలోనే బ్రహ్మపుత్ర నదీ జలాలపై తప్పుడు ప్రచారానికి తెరలేపింది. చైనా కూడా బ్రహ్మపుత్ర నది జలాలను ఆపేస్తే ఏంచేస్తారంటూ భారత్ ను ప్రశ్నిస్తోంది. తమలాగే భారత్ కూడా ఇబ్బంది పడాల్సివస్తుందని బెదిరింపులకు దిగుతోంది. అయితే, పాక్ చేస్తున్న ఈ దుష్ప్రచారాన్ని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తిప్పికొట్టారు.ఈ అంశంపై ఎక్స్ (X) వేదికగా హిమంత బిశ్వ శర్మ ఘాటుగా స్పందించారు. "ఈ కట్టుకథను భయంతో కాకుండా, వాస్తవాలు, జాతీయ స్పష్టతతో ఛేదిద్దాం," అని ఆయన పేర్కొన్నారు. బ్రహ్మపుత్ర నది భారత్‌లో ప్రవహిస్తూ విస్తరిస్తుందే తప్ప, ఎగువ ప్రాంత నియంత్రణ వల్ల కుంచించుకుపోయే నది కాదని ఆయన వివరించారు. నది మొత్తం ప్రవాహంలో చైనా వాటా కేవలం 30 నుంచి 35 శాతం మాత్రమేనని, అది కూడా టిబెట్ పీఠభూమిలోని హిమానీనదాలు కరగడం, పరిమిత వర్షపాతం వల్లే వస్తుందని తెలిపారు. మిగిలిన 65 నుంచి 70 శాతం నీరు ఈశాన్య భారతంలో కురిసే రుతుపవన వర్షాలు, ఉపనదుల ద్వారానే బ్రహ్మపుత్రలో చేరుతుందని ఆయన గణాంకాలతో సహా వివరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa