విండీస్ ఆటగాడు క్రిస్ గేల్ ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ వీక్షించడానికి అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియానికి వచ్చారు. అయితే క్రిస్ గేల్ ఆర్సీబీతోపాటు పంజాబ్ కింగ్స్కు మద్దతు తెలుపుతున్నారు. తాను IPLలో ఎక్కువ కాలం ఆడిన జట్టు ఆర్సీబీ జెర్సీని ధరించడంతోపాటు.. తక్కువ కాలం ఆడిన పంజాబ్ను సపోర్ట్ చేస్తున్నాననే విషయాన్ని తెలియజేయడం కోసం తలపాగా చుట్టుకున్నారు.ఏ జట్టు గెలిచినా.. తొలిసారి కప్ ను ముద్దాడుతుంది. ఈ రెండింట్లో ఏ జట్టు కూడా ఇప్పటివరకు ఐపీఎల్ కప్ కొట్టలేదు. 2022 తరువాత మళ్లీ అలాంటి సీన్.. ఈ రాత్రికి రిపీట్ కాబోతోంది.ఇప్పుడు మళ్లీ ఓ కొత్త విజేతను క్రికెట్ ప్రపంచానికి పరిచయం చేయబోతోంది 18వ ఐపీఎల్ సీజన్.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa