ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమరావతి ప్రాంత మహిళలను అవమానిస్తారా?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jun 08, 2025, 07:21 PM

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై ఒక టెలివిజన్ ఛానెల్‌లో విశ్లేషకుడి ముసుగులో ఒక వ్యక్తి చేసిన తీవ్ర వ్యాఖ్యల వెనుక వ్యవస్థీకృత కుట్ర ఉందని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు అమరావతి ప్రాంత మహిళలను, ఈ నేల చారిత్రక, ఆధ్యాత్మిక, బౌద్ధ వారసత్వాన్ని అవమానించేలా ఉన్నాయని ఆయన తీవ్రంగా ఖండించారు. ఇలాంటి దుష్ప్రచారాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు."ఆ మాటలను ఒక వ్యక్తి చేసిన వ్యాఖ్యలుగా చూడవద్దు. ఆ ఛానెల్ కూడా... ఆ వ్యాఖ్యలతో మాకు సంబంధం లేదు, అవి సదరు వ్యక్తి అభిప్రాయం, మాకు మహిళలంటే ఎంతో గౌరవం అంటూ తప్పించుకోలేదు. వాటిని ప్రసారం చేయడమే కాదు... చర్చ సందర్భంలో కనీసం ఖండించి, తప్పుబట్టలేదు. అంటే ఆ చర్చ వెనుక... నీచ భాషతో రాజధాని ప్రాంతాన్ని, అక్కడ నివసిస్తున్న మహిళలను, ఈ ప్రాంత చారిత్రక నేపథ్యాన్ని, విలసిల్లిన బౌద్ధాన్నీ అవమానించి అవహేళన చేయాలనే కుటిల యత్నం దాగి ఉందనే విషయాన్ని అందరూ గుర్తించాలి" అని స్పష్టం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa