గుంటూరులో ఈ నెల 14, 15 తేదీలలో జరగనున్న యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర 11వ మహాసభలను జయప్రదం చేయాలని యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు ప్రసాద్, కార్యదర్శి సుబ్బరాజా కోరారు. మంగళవారం పోరుమామిళ్ల సబ్ డివిజన్ కార్యాలయ ఆవరణలో మహాసభ పోస్టర్లను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, 2007లో సిఐటియు నేతృత్వంలో జరిగిన అనేక పోరాటాల ఫలితంగా 7200 మంది కాంట్రాక్ట్ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించడంలో యూనియన్ కీలక పాత్ర పోషించిందని తెలిపారు. మహాసభల విజయవంతమైన నిర్వహణ కోసం అందరూ సహకరించాలని కోరారు.
![]() |
![]() |