భారత్లో తీవ్ర విషాదాన్ని నింపిన అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రమాదం వెనుక కుట్ర కోణం ఉందంటూ అనుమానం వ్యక్తం చేశారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో 242 మంది ప్రయాణికులు చనిపోవడం బాధాకరమన్నారు. ఈ ఘటనను చూస్తే ఉగ్రవాదుల దాడిగా అనుమానం వ్యక్తం చేశారు. తనకు ఉన్న గ్లోబల్ ట్రావెలింగ్ ఎక్స్పీరియన్స్తో చెబుతున్నానని.. తనకు సొంతంగా ఎయిర్క్రాఫ్ట్ ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. ఈ అనుభవాన్ని బట్టి ఈ విషయాన్ని చెబుతున్నాను అన్నారు. ఈ ఘటనపై వెంటనే విచారణ చేయాలని.. చనిపోయినవారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇలాంటి సంఘటన జరగడం దురదృష్టకరమని.. ఈ ప్రమాదంలో చనిపోయినవారికి సంతాపం తెలిపారు. కేఏ పాల్ ఈ ఘటనపై అనుమానం వ్యక్తం చేస్తూ తన ఎక్స్ (ట్విట్టర్) అకౌంట్లో వీడియోను ట్వీట్ చేశారు.
గుజరాత్లోని అహ్మదాబాద్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఎయిరిండియా బోయింగ్ విమానం లండన్కు బయలుదేరింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలి మంటల్లో కాలిపోయింది. ఈ ఘటనలో మొత్తం 242మంది చనిపోయారు.. వీరిలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాణి కూడా ఉన్నారు. ఈ విమానం మధ్యాహ్నం 1.38 గంటలకు అహ్మదాబాద్ విమానాశ్రయం నుండి బయలుదేరింది.. టేకాఫ్ అయ్యాక కొద్దిసేపటికే కుప్పకూలింది. విమానాశ్రయం సమీపంలోని మేఘానీనగర్లో ఇది వైద్యులు, నర్సింగ్ సిబ్బంది ఉండే భవనంపై కూలిపోయింది.
విమానం కూలిన వెంటనే పెద్ద ఎత్తున మంటలు చెలరేగి.. నల్లటి పొగలు ఆ ప్రాంతాన్ని కమ్మేశాయి. అయితే ఈ విమాన ప్రమాదం నుంచి ఒక ప్రయాణికుడు మాత్రమే గాయాలతో బయటపడ్డాడు. మిగిలిన వారంతా ప్రాణాలు కోల్పోయారు. అయితే విమానం కుప్పకూలిన భవనంలో ఉన్న బీజే మెడికల్ కాలేజీలో మెడికోలు కూడా చనిపోయినట్లు తెలుస్తోంది. ఈ విమానం కూలిపోతున్న సమయంలో ఒక వ్యక్తి తన మొబైల్ ఫోన్లో వీడియోను రికార్డ్ చేయడంతో వైరల్ అయ్యింది. ఈ ఘ ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధానమంత్రి ఇతర ప్రముఖులు ఈ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా, కేంద్ర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు హుటాహుటిన అహ్మదాబాద్ వెళ్లారు. ప్రమాద స్థలాన్ని పరిశీలించి.. అక్కడ సహాయక చర్యల్ని పర్యవేక్షించారు.
ఈ విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన బాధితుల కుటుంబాలకు అండగా ఉంటామంది ఎయిరిండియా. ఈ ఘటనపై దర్యాప్తునకు పూర్తిగా సహకారం అందిస్తామన్నారు. ఈ ప్రమాదం తర్వాత హాట్లైన్ నంబర్ (1800 5691 444)ను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. అయితే విమాన ప్రయాణికుల సమాచారం కోసం కేటాయించిన హాట్లైన్ నంబర్కు ఫోన్లు చేయొద్దని ఎయిరిండియా కోరింది.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa