తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఫోన్ కూడా ట్యాపింగ్ చేసినట్లు సమాచారం. ఆ సమయంలో ఏపీలో వైసీపీ అధికారంలో ఉండగా.. హైదరాబాద్లో ఉంటున్న షర్మిల ఫోన్ను ట్యాపింగ్ చేసినట్లు తెలిసింది. షర్మిల ఎవరెవరితో మాట్లాడుతున్నారనేది ఎప్పటికప్పుడు జగన్కు చేరవేయడానికి కోడ్ లాంగ్వేజ్ వాడినట్లు తెలుస్తోంది. తెలంగాణకు చెందిన ఓ పోలీస్ అధికారి ద్వారా ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa