ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ట్రంప్కు నోబెల్ అవసరమా.. పాకిస్తాన్ సర్కార్కు స్వదేశంలోనే వ్యతిరేకత

international |  Suryaa Desk  | Published : Mon, Jun 23, 2025, 10:22 PM

డొనాల్డ్ ట్రంప్‌కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలనే ప్రతిపాదనపై పాకిస్తాన్‌లో చర్చ జరుగుతుండగా.. ఆ దేశంలోని ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇరాన్‌పై అమెరికా దాడుల నేపథ్యంలో ట్రంప్‌ను శాంతి బహుమతికి పాక్ ప్రభుత్వం సిఫారసు చేయడం అనేది వ్యతిరేక విమర్శలకు గురవుతోంది. షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వానికి ఈ ప్రతిపాదనపై మళ్ళీ ఆలోచించాలని ప్రతిపక్షాలు కోరుతున్నాయి. ట్రంప్ శాంతిని కాపాడటానికి కాకుండా యుద్ధాలకు మద్దతు ఇస్తున్నారని పాక్‌లోని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. ఈ వివాదం ఇప్పుడు 2026 సంవత్సరానికి గాను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలనే ప్రతిపాదనను పాకిస్తాన్ ప్రభుత్వం పరిశీలించాలని ఆ దేశంలోని ప్రతిపక్షాలు డిమాండ్చేస్తున్నాయి. ఇరాన్‌లోని న్యూక్లియర్ స్థావరాలపై అమెరికా దాడి చేసిన నేపథ్యంలో ట్రంప్‌కు నోబెల్ బహుమతి ఇవ్వడం సరి కాదని అక్కడి ప్రతిపక్షాలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి. ట్రంప్‌కు నోబెల్ బహుమతి ఇవ్వాలని పాకిస్తాన్ ప్రతిపాదించిన వెంటనే ఆయన ఇరాన్‌పై దాడులు చేయడం తీవ్ర వివాదాస్పదం అయింది. దీనిపై పాకిస్తాన్‌లోని ప్రతిపక్షాలు షెహబాజ్ షరీఫ్ సర్కార్‌పై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి.


ఈ నేపథ్యంలోనే ట్రంప్‌నకు నోబెల్ బహుమతి ఇవ్వాలనే ప్రతిపాదనను పాక్ ప్రభుత్వం పునఃసమీక్షించాలని ప్రతిపక్షాలు కోరుతున్నాయి. పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీకి చెందిన ఎంపీ అలీ ముహమ్మద్ ఖాన్ మాట్లాడుతూ.. ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధంలో తమ మద్దతు టెహ్రాన్‌కే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఇరాన్‌పై దాడులు చేసిన అమెరికా అధ్యక్షుడిని నోబెల్ బహుమతికి ప్రతిపాదించినందుకు పాక్ ప్రభుత్వం సిగ్గుపడేలా.. ట్రంప్ ప్రవర్తించారనితెలిపారు. ఇకనైనా ఆ ప్రతిపాదనను షరీఫ్ ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని అలీ ముహమ్మద్ ఖాన్ డిమాండ్ చేశారు.


మరోవైపు.. జమియత్ ఉలేమా-ఇ-ఇస్లాం పార్టీ నాయకుడు మౌలానా ఫజ్లుర్ రెహ్మాన్ మాట్లాడుతూ.. ట్రంప్ శాంతికాముకుడు అనే వాదనను ఆయనే స్వయంగా తప్పని నిరూపించుకున్నారని పేర్కొన్నారు. పాలస్తీనా, సిరియా, లెబనాన్, ఇరాన్‌లపై.. ఇజ్రాయెల్ చేస్తున్న దాడులకు మద్దతిచ్చిన అమెరికా అధ్యక్షుడు ఎలా శాంతిదూత అవుతాడని ప్రశ్నించారు. పాక్ ప్రభుత్వం వెంటనే ట్రంప్ పేరును నోబెల్ బహుమతికి ప్రతిపాదించడాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.


ఇక.. వైట్‌హౌస్‌లో డొనాల్డ్ ట్రంప్‌తో పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌.. లంచ్ మీటింగ్ ఏర్పాటు చేయడం వల్లే పాక్ ప్రభుత్వంఆయనను నోబెల్ శాంతి బహుమతికి ప్రతిపాదించి ఉండవచ్చని కొందరు నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. శాంతి కోసం పనిచేసే నాయకుడు ట్రంప్ కాదని.. ఆయన ఉద్దేశపూర్వకంగానే పలు యుద్ధాలకు మద్దతు ఇస్తున్నారని పాక్ మాజీ సెనేటర్ ముషాహిద్ హుస్సేన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అన్ని దేశాలను నాశనం చేయాలనే ఆలోచనతో ట్రంప్ అమెరికా పతనానికి అధ్యక్షత వహిస్తున్నాడని ఆయన విమర్శించారు. రక్తంతో తడిచిన ట్రంప్ చేతులకు శాంతి బహుమతిని అందుకునే అర్హత లేదని స్పష్టం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa