ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) సభ్యుడిగా జేఎన్టీయూ – అనంతపురం మాజీ రిజిస్ట్రార్ డాక్టర్ సి. శశిధర్ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ ఆదివారం అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేయగా, ఆయన నిన్న బాధ్యతలు స్వీకరించారు. గతంలో రాజధాని అమరావతిని వ్యతిరేకించిన శశిధర్ దానిపై సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. అప్పట్లో జగన్ ప్రభుత్వానికి మద్దతుదారుడిగా వ్యవహరించారు."లక్షల కోట్లు వెచ్చించి నిర్మించే రాజధాని సరికాదు. ఒక సివిల్ ఇంజనీరింగ్ నిపుణుడిగా నేను అమరావతి ప్రాంతంలో పర్యటించాను. అక్కడ బేస్మెంట్కే ఎక్కువ మొత్తాన్ని వెచ్చించాలి. అమరావతి అభివృద్ధి చెందాలంటే కనీసం 30 ఏళ్లు పడుతుంది. అధికార వికేంద్రీకరణ జరిగితే అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందుతాయి" అని 2020 జనవరి 20న శశిధర్ వ్యాఖ్యానించారు.అలా వ్యాఖ్యానించిన శశిధర్ను నేడు కూటమి ప్రభుత్వం ఏపీపీఎస్సీ సభ్యుడిగా నియమించడంతో ఆ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa