ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గుంటూరు మిర్చి యార్డు పర్యటనలో జగన్ పై కేసు నమోదు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jun 25, 2025, 01:17 PM

ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్న సమయంలో మాజీ సీఎం జగన్‌, వైసీపీ నేతలు గుంటూరు మిర్చి యార్డులోకి ప్రవేశించారని  పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయా నేతలకు మంగళవారం 41ఏ కింద నోటీసులు జారీ చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి 19న ఎమ్మెల్సీ కోడ్‌ అమల్లో ఉండగా జగన్‌ మిర్చి యార్డు పర్యటనకు వచ్చారు. అయితే, కోడ్‌ నేపథ్యంలో పోలీసులు అనుమతి లేదని స్పష్టం చేశారు. అయినప్పటికీ  పార్టీ నాయకులు, కార్యకర్తలతో జగన్‌ మిర్చి యార్డుకు వచ్చారు. దీనిపై అదే రోజు నల్లపాడు పోలీస్‌ స్టేషన్‌లో క్రైమ్‌ నెంబర్‌ 206/2025తో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో జగన్‌తో పాటు వైసీపీ తలశిల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డి, మోదుగుల వేణుగోపాల్‌ రెడ్డి, మాజీ మేయర్‌ కావటి మనోహర్‌ నాయుడు తదితరులు ఉన్నారు. జగన్‌ మినహా మిగిలిన వారికి పోలీసులు మంగళవారం నోటీసులు జారీ చేశారు. అదేవిధంగా మాజీ మంత్రి అంబటి రాంబాబుకు నోటీసు ఇచ్చేందుకు ఇంటికి వెళ్లగా ఆయన అందుబాటులో లేరని సిబ్బంది చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa