బుక్కరాయసముద్రంలో శుక్రవారం మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ కూటమి ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మహిళల రక్షణ పూర్తిగా క్షీణించిందని, బాలికలపై జరుగుతున్న దారుణ ఘటనలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆమె ఆరోపించారు. జిల్లాలో ఇటీవల జరిగిన బాలిక హత్య మరియు హరిజన బాలికపై సామూహిక అత్యాచారం వంటి ఘటనలు మహిళల భద్రతపై ప్రభుత్వ వైఫల్యాన్ని తెలియజేస్తున్నాయని ఆమె అన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, హోం మంత్రి అనిత ఈ ఘటనల బాధితులను పరామర్శించకపోవడం దారుణమని ఉషశ్రీ చరణ్ విమర్శించారు. బాధిత కుటుంబాలకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణిని కొనసాగిస్తోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనలపై సీరియస్గా స్పందించి, తక్షణ చర్యలు తీసుకోవాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
అదే సమయంలో, మాజీ ముఖ్యమంత్రి జగన్పై కూటమి నాయకులు చేస్తున్న అనవసర విమర్శలను ఆమె తప్పుబట్టారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడడంలో విఫలమవుతూ, ప్రతిపక్షంపై నీచమైన ఆరోపణలు చేయడం సరికాదని హెచ్చరించారు. ప్రజల భద్రత కోసం ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి పెట్టాలని, రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడవద్దని ఉషశ్రీ చరణ్ సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa