ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సివిల్‌ వివాదాలపై హైకోర్టు సూచనలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jun 29, 2025, 11:05 AM

సివిల్‌ వివాదాల పరిష్కారంలో తీసుకోవాల్సిన విధి విధానాలపై జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బీఎస్‌ భానుమతి అన్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని న్యాయాధికారులకు శనివారం స్థానిక జిల్లా కోర్టులో రెండో జిల్లాస్థాయి వర్క్‌షాపును ఆమె జ్యోతి వెలిగించి ప్రారంభించారు. సివిల్‌ ప్రొసీజర్‌ కోడ్‌లోని సెక్షన్‌-9, లోక్‌అదాలత్‌ తీర్పులపై ఒకరోజు వర్క్‌ షాపులో ఆమె మాట్లాడుతూ లోక్‌అదాలత్‌ తీర్పులు అమలయ్యేందుకు గట్టిగా కృషి చేయాలని కోరారు. హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ వి.రాధాకృష్ణ కృపాసాగర్‌, విశ్రాంత జిల్లా న్యాయాధికారి టి.వేణుగోపాల్‌రావు రిసోర్స్‌ పర్సన్స్‌గా ఈ విధి విధానాలను వివరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa