ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు చంద్రబాబు అధ్యక్షతన విస్తృత స్థాయి సమావేశం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jun 29, 2025, 11:29 AM

ఆదివారం ఉదయం 11 గంటలకి టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు అధ్యక్షతన పార్టీ కేంద్ర కార్యాలయంలో విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ కన్వీనర్లు అందరూ హాజరుకానున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా జులై 2వ తేదీ నుంచి కూటమి నేతలు ఇంటింటి ప్రచారం నిర్వహించాలని ఇప్పటికే చంద్రబాబు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. సుమారు నెల రోజుల పాటు నేతల ప్రచారం కొనసాగనుంది. ఈ ఏడాది పాలనలో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకువెళ్లేలా ప్రచారం చేయనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa