పశ్చిమ బెంగాల్ను కుదిపేస్తున్న కోల్కతా లా కాలేజీ విద్యార్థినిపై సామూహిక లైంగికదాడి కేసులో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడైన మనోజిత్ మిశ్రా గత కొన్నేళ్లుగా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని, అతడి వికృత ప్రవర్తన గురించి కాలేజీ యాజమాన్యానికి తెలిసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని తోటి విద్యార్థులు, జూనియర్లు ఆరోపిస్తున్నారు. కాగా సౌత్ కలకత్తా లా కాలేజీలో చదువుతున్న 24 ఏళ్ల యువతిపై జూన్ 25న అత్యాచారం జరిగిన విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడైన మనోజిత్ మిశ్రా, అతడి అనుచరులు జైబ్ అహ్మద్, ప్రమిత్ ముఖోపాధ్యాయ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టు వారిని జులై 1 వరకు పోలీసు కస్టడీకి అప్పగించింది. మనోజిత్ మిశ్రాకు నేర చరిత్ర ఉందని, విద్యార్థినులను వేధించడంలో అతడు ముందుండేవాడని తెలుస్తోంది. అమ్మాయిల ఫొటోలను మార్ఫింగ్ చేసి స్నేహితులకు పంపడం, మహిళలతో ఏకాంతంగా గడిపిన క్షణాలను వీడియో తీసి షేర్ చేయడం, విద్యార్థినులను బాడీ షేమింగ్ చేయడం వంటివి అతనికి అలవాటని కాలేజీ వర్గాలు చెబుతున్నాయి. అతడిపై గతంలో లైంగిక వేధింపులు, దాడులు, బెదిరింపులకు సంబంధించి అనేక ఫిర్యాదులు వచ్చినా కాలేజీ యాజమాన్యం వాటిని పెడచెవిన పెట్టిందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. "అతను, అతని అనుచరులు అమ్మాయిల పాలిట ఉగ్రవాదుల్లా ఉండేవారు. ఈ విషయం అధికారులకు తెలిసినా అతడిని కాపాడారు. లైంగిక వేధింపులపై టీచర్-ఇన్-ఛార్జ్కు అధికారికంగా ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకపోయింది" అని ఓ థర్డ్ ఇయర్ విద్యార్థిని ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’కు వివరించింది. యూనియన్ సభ్యులకు ఏదైనా చేసే లైసెన్స్ ఉండేదని, భయంతో తాము మౌనంగా ఉండాల్సి వచ్చేదని మరో జూనియర్ విద్యార్థి ఆవేదన వ్యక్తం చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa