మైనారిటీల పక్షాన నిలబడిన ఏకైక పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే అని పార్టీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం వైయస్ఆర్సీపీ మైనారిటీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఖాదర్ బాషా అధ్యక్షతన రాష్ట్రస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సజ్జల రామకృష్ణారెడ్డి హాజరై పార్టీ బలోపేతం, ప్రజల తరఫున చేయాల్సిన పోరాటాలపై దిశానిర్దేశం చేశారు. సమావేశంలో పార్టీ మైనారిటీ విభాగం ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా, అసెంబ్లీ విభాగాల అధ్యక్షులతో పాటు, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ..... వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సంస్ధాగతంగా పట్టిష్టం చేయడం మన ప్రధాన కర్తవ్యం. మన పార్టీకి నిజమైన బలం కార్యకర్తలే. మన నాయకుడు వైయస్ జగన్ గారి శక్తి కూడా కార్యకర్తలే. పార్టీ తన ప్రస్ధానంలో అనేక రికార్డులు సృష్టించింది. వైయస్ జగన్ గారు తన పాలనలో పలు విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చారు. పాలనలో డెలివరీ మెకానిజం డెవలప్ చేయడంతో పాటు, విద్య, వైద్యం వంటి కోర్ సెక్టార్స్ను ప్రతి గడపకు తీసుకెళ్ళారు. రాష్ట్రాన్ని అభ్యుదయ పథంలో నడిపించేందుకు, ఏవేవి చేయాలో ఆలోచించి, వాటిని అమలు చేశారు. సంక్షేమానికి నిజమైన అర్ధం చెప్పిన పాలన మాది. అదే కూటమి ప్రభుత్వంపై ఏడాది పాలనతోనే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తోంది అని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa