ఇంగ్లండ్ - ఇండియా మధ్య ఎడ్జ్బాస్టన్ వేదికగా రేపు రెండో టెస్టు మ్యాచ్ జరగనుంది. మొదటి టెస్టులో ఓటమి తర్వాత ఈ మ్యాచ్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కోచ్ గౌతమ్ గంభీర్.. జట్టులో మార్పులు చేసేందుకు సిద్ధమయ్యాడు. రెవ్ స్పోర్ట్స్ ఆధారంగా రెండో టెస్టులో టీమిండియాలో నాలుగు మార్పులు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇద్దరు పేసర్లతో పాటు ఒక స్పిన్ ఆల్రౌండర్ను జట్టులో తీసుకోనున్నారట.
మొదటి టెస్టులో టీమిండియా పేసర్లు మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ దారుణంగా విఫలమయ్యారు. బుమ్రా మినహా మిగతా ఎవ్వరూ ప్రభావం చూపలేకపోయారు. బౌలింగ్ ఆల్రౌండర్ శార్థూల్ ఠాకూర్ కూడా అనుకున్నట్లు వికెట్లు తీయలేకపోయాడు. బ్యాటింగ్లో కూడా రాణించలేకపోయాడు. దాంతో ఈ ముగ్గురి స్థానాలను రీప్లేస్ చేసే యోచనలో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఉన్నాడట.
రక్తం తక్కువగా ఉందని ఐరన్ ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నారా, మందులు వాడకుండానే ఇప్పుడు చెప్పే ఫుడ్స్ తిని బ్లడ్ని పెంచుకోండి
నిన్నటి వరకు కుల్దీప్ యాదవ్ ప్లేయింగ్ 11లో చోటు సంపాదిస్తాడు అనుకుంటే.. ఇప్పుడు కొత్తగా వాషింగ్టన్ సుందర్ పేరు తెరపైకి వచ్చింది. సుందర్తో పాటు నితీష్ కుమార్ రెడ్డి కూడా జట్టులోకి వస్తున్నాడట. బుమ్రాకి రెస్ట్ ఇచ్చే ఆలోచనలో కోచ్ ఉండటంతో.. అర్షదీప్ సింగ్, ఆకాశ్ దీప్ సింగ్ను జట్టులోకి తీసుకునే అవకాశాలు ఉన్నట్లు రెవ్ స్పోర్ట్స్ చెబుతోంది.
వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి, అర్షదీప్ సింగ్, ఆకాశ్ దీప్ జట్టులో చేరితో నలుగురు ఆటగాళ్లు బయటకు వెళ్లాల్సి వస్తుంది. శార్థూల్ ఠాకూర్, ప్రసిద్ కృష్ణ, మహమ్మద్ సిరాజ్, జస్ప్రిత్ బుమ్రా లేకుండా రెండో టెస్టుకు టీమిండియా వెళ్లనుందా? లేక కరుణ్ నాయర్ని పక్కనబెట్టి సిరాజ్, ప్రసిద్లో ఒకరికి ఆడిస్తారా? అనేది వేచి చూడాలి.
ఇక ఎడ్జ్బాస్టన్ స్టేడియంలో టీమిండియా ఇప్పటి వరకు ఒక్క టెస్టు మ్యాచ్ కూడా గెలిచిన దాఖలాలు లేవు. ఇప్పటి వరకు టీమిండియా ఎనిమిది టెస్టులు ఆడితే ఒక్కటి కూడా గెలవలేదు. అందులో ఏడు మ్యాచ్లు ఓడిపోగా.. ఒక మ్యాచ్ మాత్రం డ్రా అయింది. అయితే, ఈ రికార్డులను బద్దలుకొట్టి రేపు జరగబోయే టెస్టులో విజయం సాధించాలని గిల్ సారథ్యంలోని యువ భారత్ చూస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa